రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం...డాక్టర్ కోయ ప్రవీణ్,కర్నూలు రేంజ్ డిఐజి...
రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యండాక్టర్ కోయ ప్రవీణ్,కర్నూలు రేంజ్ డిఐజివిక్రాంత్ పాటిల్,జిల్లా ఎస్పీ
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీ సు అధికారులకు కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్,జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ లు ఆదేశాలు జారీ చేశారు.వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు.ఈ మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీసుస్టేషన్ పరిధులలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై సమావేశాలు నిర్వహించి,అవగాహన కల్పించారు.మైనర్లు వాహనా లు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.బైక్ లు నడిపే వారు ఖ చ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా,ఓవర్ స్పీడ్,ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్ళకుండా, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని తదితర రోడ్డు భద్రత ప్రాముఖ్యతలపై ప్రజలకు అవగాహన క ల్పించారు.

Comments
Post a Comment