పదవి వీరమణ పొందిన డిపిఓ ఎఓ, సిఐ,ఎస్సైలు,ఎఎస్సైలకు ఘన సన్మానం...విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ...
పదవి వీరమణ పొందిన డిపిఓ ఎఓ, సిఐ,ఎస్సైలు,ఎఎస్సైలకు ఘన సన్మానంవిక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేసి పోలీసు సిబ్బంది పదవి వీరమణ పొందడం అభి నందనీయమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శనివారం పదవీ విరమ ణ పొందిన కర్నూలు డిపిఓ ఎఓ-ఎ.విజయ్ కుమార్ నాయుడు,సిఐ–జి.సుగుణ కుమా రి,కర్నూలు సిసియస్ ఎస్సై–రావూఫ్, కర్నూలు స్పెషల్ బ్రాంచ్ ఎస్సై-ఎ.కొండయ్య, క ర్నూలు పిసిఆర్ ఎస్సై–బి.ఉమాపతి,కర్నూలు పిసిఆర్ ఎస్సై–ఎస్.పి.మహబూబ్ భాష, ఆదోని తాలుకా ఎఎస్సై-కె.జి.ఎల్ నారాయణలను జిల్లా పోలీసు కార్యాలయంలో శని వారం జిల్లా ఎస్పీ శాలువ,పూలమాలతో సత్కరించి,జ్ఞాపికను అందజేశారు.ఈ సంద ర్బంగా ఎస్పీ మాట్లాడారు. కుటుంబాలతో సంతోషంగా గడపాలని,పదవివీరమణ పొంది న తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా,స్పెష ల్ బ్రాంచ్ సిఐ తేజమూర్తి,డి సిఆర్ బి సిఐ గుణశేఖర్ బాబు,ఆర్ ఐ నారాయణ,స్పెషల్ బ్రాంచ్ ఎస్సై వేణుగోపాల్ రా జు,జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు పాల్గొన్నారు.

Comments
Post a Comment