బాల్ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు కన్నయ్య జ్ఞాపకార్ధం బాల్ బ్యాట్మెంటన్ పోటీలు...
VS9TV న్యూస్,కల్లూరు :
కర్నూలు నగరం,32వ వార్డ్,ముజఫర్ నగర్ లో ఉగాది పండుగ సందర్భంగా బాల్ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు కన్నయ్య జ్ఞాపకార్ధంగా బాల్ బ్యాట్మెంటన్ పోటీలు నిర్వహించారు.పోటీలకు స్టార్ ఆఫ్ ఇండియా బాల్ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు రామకృష్ణ హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత సంవత్సరంలో ప్రమాదబారినపడి కన్నయ్య మృతి క్రీడాకారుల్లో తీరని దిగ్బ్రాంతిని మిగిలించిందని ఆవేదన చెందారు.క్రీడల పట్ల కన్నయ్య ఎంతో చొరవచూపేవాడని,ప్రతి క్రీడాకారున్ని కలుపుకొని పలుమార్లు క్రీడపోటీలలో పాల్గొనేవాడని గుర్తుచేశారు.కన్నయ్య జ్ఞాపకార్థంగా ముజఫర్ నగర్ బాల్ బ్యాట్మెంటన్ పోటీలు జరుపుతున్న క్రీడాకారులను అభినందించారు.కన్నయ్య పేరుతో అనేక క్రీడాపోటీలు జరిపించాలని సూచించారు.ఈ పోటీలో నాలుగు టీంలు పాల్గొన్నాయని అన్నారు.దాతల సహకారంతో బాల్ బ్యాట్మెంటిన్ పోటీలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు శ్రీనివాసులు,గిరి,శ్యామ్, సుల్తాన్,సీనియర్ బ్యాట్మెన్ క్రిరకారుడు ఆనంద్ మాట్లాడుతూ కల్లూరు మండలంలో క్రీడామైదానం లేక గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు వెనకబడుతున్నారని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం యువతను ప్రోత్సహించే విధంగా క్రీడామైదానం ఏర్పాటుచేయాలనీ వారు డిమాండ్ చేశారు.పోటీల్లో ప్రధమ బహుమతి పొందినవారు కె.నాగేంద్ర ప్రధమ స్థానం,శ్రీను రెండవ స్థానం పొందారు.పోటీలకు పరిశీలకులుగా శ్రావణ్,గిరి,కిరణ్,వీరేంద్ర ధను,అఖిల్ ఉన్నారు.
Comments
Post a Comment