రంజాన్ సందర్బంగా గట్టి భద్రత…పకడ్బందీ తనిఖీలు...ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలి...మధుసూదన్ గౌడ్,నాల్గవ పట్టణ సిఐ...
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
రంజాన్ పండుగను పురస్కరించుకొని సోమవారం భారీ సంఖ్యలో ముస్లిం, సోదరులు మసీదులకు,ఈద్గాలకు రానున్న నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ బందోబస్తు విధులు నిర్వహించాలని, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీస్ అధికారులు,సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కర్నూల్ డిఎస్పీ బాబుప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు నాల్గవ పట్టణ సిఐ మధుసూదన్ గౌడ్ సూచనల మేరకు కర్నూలు నాలుగవ పట్టణ ఎస్సై సమీర్ భాష,బాంబు స్క్వాడ్ బృందాలతో ఓల్డ్ ఈద్గా,న్యూ ఈద్గా తదితర ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు.ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టారు.
Comments
Post a Comment