అర్ధరాత్రి కంగారు పెట్టించిన ఆటో డ్రైవర్...కౌన్సిలింగ్ చేసి మందలింపు..

ఊపిరి పీల్చుకున్న కర్నూలు పోలీసులు...

మన న్యూస్,కర్నూలు క్రైం :

నంద్యాల నుండి కర్నూలు వైపు వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు తన ఆటోను ఆపి,దాడి చేసి గాయపరిచి,ఆటో ఎత్తుకెళ్ళారని కాల్వబుగ్గ సమీపంలో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నయారా పెట్రోల్ బంక్ లోకి వచ్చి కర్నూలు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో కర్నూలు కమాండ్ కంట్రోల్ నుండి కర్నూలు పోలీసులు అప్రమత్తం అయ్యారు.జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు సబ్ డివిజన్ పోలీసులతో విచారణ చేపట్టారు.చెక్ పోస్టులు,కర్నూలు సరిహద్దు ప్రాంతాలలో అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు.కర్నూలు డిఎస్పీ జె.బాబుప్రసాద్ ఓర్వకల్లుకు అర్థరాత్రి వెళ్ళి పరిశీలన చేశారు.ఈ మేరకు బుధవారం ఘటన వివరాలు వెల్లడించారు.కాల్వబుగ్గ దగ్గరకు వెళ్ళి సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళి చూస్తే ఆటో లోయలో పడింది.ఆటో డ్రైవర్ కు బాగా గాయాలయ్యాయి. అయితే పోలీసుల విచారణలో నల్గొండ జిల్లా,మిర్యాల గూడకు చెందిన డ్రైవర్ పేరు మనోజ్ (32),జమ్ములమడుగు చెందిన మహిళను పెళ్ళి చేసుకున్నాడు.భార్య గొడవపడి జమ్ముల మడుగుకు వాళ్ళ ఇంటికి వెళ్ళింది.ఆటోడ్రైవర్ తన భార్య కోసం నల్గొండ జిల్లా,మిర్యాల గూడ నుండి ఒక వారం రోజుల నుండి ఆటో నడుపుకుంటూ జమ్ముల మడుగుకు బయలు దేరాడు. జమ్ములమడుగు వెళ్ళి తిరుగు ప్రయాణంలో నంద్యాల నుండి బయలు దేరి కర్నూలుకు వచ్చే సమయంలో ఓర్వకల్లు పోలీసుస్టేషన్ పరిధిలోని కాల్వబుగ్గ దగ్గర ఆటో లోయలో పడిన సంఘటన జరిగింది.ఆటో దొంగలించారనేది నన్నూరు టోల్ గేట్ దగ్గర వెళ్ళి సిసి కెమెరాలను తనిఖీలు చేస్తే ఆటోనే వెళ్ళలేదని తెలిసింది.ఆటో డ్రైవర్ ను బాగా విచారిస్తే మద్యం తాగిన మత్తులో నేను ఏమి మాట్లాడానో తెలియడం లేదని,బ్రెయిన్ సరిగా పని చేయలేదని తెలిపాడు.ఆటో డ్రైవర్ ను కర్నూలు పోలీసులు మందలించి కౌన్సిలింగ్ చేసి పంపించారు.లోయలో పడిన ఆటోను జెసిబితో తీయించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....