యూనివర్శిటి ఖ్యాతిని పెంపొందించడంలో విద్యార్థులే ప్రథానపాత్ర పోషించాలి... వి.వెంకట బసవరావు,విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య..

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :

రాయలసీమ యూనివర్శిటి ఖ్యాతిని పెంపొందించడంలో విద్యార్థులే ప్రథానపాత్ర పోషించాలని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వి.వెంకట బసవరావు పిలుపునిచ్చారు.బుధవారం యూనివర్శిటి ఇంజినీరింగ్ కాలేజీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సెమినార్ 2025 (TECH VUDBHAV - 2K25) కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర సాంకేతికరంగాల్లో కొనసాగుతున్న పరిశోధనలు,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన నూతన ఆవిష్కరణలపట్ల ఇంజినీరింగ్ విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు.తాము చదువుతున్న విభాగాల్లో విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ప్రాజెక్టు వర్కులు పూర్తిచేసినపుడే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.కేవలం తరగతిగదికే పరిమితం కాకుండా లైబ్రరీతోపాటు,ఇంటర్నెట్లో అందుబాటులోఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఈ దిశగా యూనివర్శిటిలోని వసతులను సద్వినియోగం చేసుకుంటూ, విద్యార్థులంతా జీవితంలో పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.వర్శిటి ఇంజినీరింగ్ కాలేజీలో వసతుల మెరుగుదలకు కృషిచేస్తున్నట్లు తెలిపారు.విద్యార్థుల జీవితానికి మేలి మలుపుగా నిలిచే ఇంజినీరింగ్ విద్యను ఏమాత్రం అలక్ష్యం చేయవద్దని ఆచార్య బసవరావు హితవు పలికారు. యూనివర్శిటి రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్ కుమార్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడంవల్ల అది వారి భవిష్యత్తుకు ఎంతగానో సహకరిస్తుందని అభిప్రాయపడ్డారు.అనంతరం పేపర్ ప్రెజెంటేషన్,పోస్టర్ ప్రెజెంటేషన్ మొదలైన కార్యక్రమాలను వి.సి.ఆచార్య బసవరావు, రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్ కుమార్ నాయుడు పరిశీలించి విద్యార్థులను,అధ్యాపకులను అభినందించారు.కార్యక్రమాన్ని రేపు కూడా ఇదేస్ఫూర్తితో కొనసాగించాల్సిందిగా వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యూనివర్శిటి విద్యార్థిని,విద్యార్థులు అధ్యాపకులు,బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....