శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు కూరగాయలు పంపిణీ...
VS9TV న్యూస్,కల్లూరు :
కల్లూరు మండలం,పందిపాడు గ్రామం, బి.ఆర్.రెడ్డి కాలనీ నందు ఉన్న శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్టు వారు ఉగాది పండుగ సందర్భంగా కల్లూరు గ్రామ సమీపంలోని నిరుపేద కుటుంబాలకు ఆదివారం కూరగాయలు పంపిణీ చేశారు.ట్రస్ట్ వారు సేవా విషయంలో అన్నిట ముందు ఉండడం గమనార్హం.ప్రతి అమావాస్యకు ట్రస్ట్ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ట్రస్ట్ చైర్మన్ వాసంతి మాట్లాడుతూ ట్రస్టులో అనాధలు,వృద్ధులను చేర్చుకుంటామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ పవన్ చౌదరి, కోశాధికారి మధుసూదన్,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment