పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలి...కెవిపిఎస్ డిమాండ్...

VS9TV న్యూస్,కల్లూరు :

కల్లూరు అర్బన్ పరిధి,32వ వార్డ్, ముజఫర్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో ముజఫర్ నగర్ ఆటో స్టాండ్ వద్ద పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కెవిపిఎస్ ఆధ్వర్యంలో వార్డు అధ్యక్షులు ఇ.రామాంజనేయులు అధ్యక్షతన నిరసన కార్యక్రమం జరిగింది.ఈ సందర్బంగా సిఐటియు నాయకులు కె.సుధాకరప్ప, కెవిపిఎస్ నగర కార్యదర్శి వర్గ సభ్యులు యం.సి. ఆనంద్,డివైఎఫ్ఐ నగర కార్యదర్శి యస్. హుస్సేన్ భాష మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక మైనార్టీలపై జరుగుతున్న దాడులు కాస్త మతోన్మాదులు హత్యలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారని విమర్శించారు.ప్రవీణ్ పగడాల మరణం ముమ్మాటికి మతోన్మాదుల హత్యేనని, ప్రభుత్వం దీనిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ప్రవీణ్ పగడాల సోషల్ మీడియాలో పదేపదే తమకు ప్రాణహాని ఉందని చెబుతున్న ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా ఆయనకు సరైన భద్రత కల్పించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి కారణమని తెలిపారు‌.ఆయన మృతిపై ఇప్పటికే ప్రజాసంఘాలు,ప్రజాతంత్ర వాదులు,లౌకికవాదులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని,ప్రభుత్వం స్పందించి ఆయన మృతిపై సమగ్ర విచారణ జరిపించి న్యాయమైన రిపోర్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ కార్యకర్తలు కె.సురేష్,ఎం.శ్రావణ్, వై.సుధాకర్,ఎం.రాజు,మహేష్,వెంకటేష్, కె.బీసన్న,టి.ఈశ్వరమ్మ,మాణిక్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....