గొందిపర్ల గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి...సిపిఎం డిమాండ్...

VS9TV న్యూస్,కర్నూలు మండలం :

కర్నూలు మండలం,గొందిపర్ల గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం మండల నాయకులు రాఘవేంద్ర, సీనియర్ నాయకులు ఆంజనేయులు డిమాండ్ చేశారు.మంగళవారం ప్రజా చైతన్య యాత్ర గొందిపర్ల గ్రామంలో వీధి వీధిన తిరిగి,అలాగే ఇందిరమ్మ కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందిందని అన్నారు.గొందిపర్ల గ్రామంలో రోడ్లు పూర్తిగా దెబ్బతినిపోయాయని చెప్పారు.డ్రైనేజీ నిర్మాణం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందన్నారు.ప్రతిరోజు శుభ్రమైన మంచినీరు అందించడం లేదని విమర్శించారు.ప్రచారం సందర్భంగా అనేకమంది కొత్త పెన్షన్ల కోసం ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నామని తెలియజేశారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు.వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, రైతులకు ఇస్తామన్న పెట్టుబడి సహాయం, తల్లికి వందనం పేరుతో ఇస్తామన్న సహాయం,ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ఇస్తామన్న రూ.1500 నిరుద్యోగ భృతి,మెగా డీఎస్సీ,ఎస్సై,కానిస్టేబుల్ సమస్యల పరిష్కారం చేసి,వారికి ఉద్యోగాలు అలాగే ఇళ్ల స్థలాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 28వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నా జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కృష్ణ,వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి,మునిస్వామి,శివ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...