అమరవీరుల స్ఫూర్తితో నాణ్యమైన విద్య కోసం పోరాడుదాం...
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
అమరవీరుల స్ఫూర్తితో నాణ్యమైన విద్య కోసం పోరాడాలని ఈ తాండ్రపాడు గ్రామ సర్పంచ్ బాలపీర,ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్,డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ప్రకాష్ లు పిలుపునిచ్చారు.మంగళవారం కర్నూలు మండలం,ఈ.తాండ్రపాడు గ్రామంలో భగత్ సింగ్ సుఖదేవ్ రాజు గురుల 23వ వర్ధంతి ఉత్సవాలలో భాగంగా కార్యక్రమం ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అంజి అధ్యక్షతన జరిగింది.ముందుగా అమరవీరుల చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు.అనంతరం సర్పంచ్ బాలపీరా,ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్,మండల్ కార్యదర్శి ప్రకాష్,ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి మాట్లాడారు.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య కోసం మెరుగైన సౌకర్యాల కోసం ప్రతి విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో పోరాడాలని అన్నారు.ప్రభుత్వం మెగా డీఎస్సీ పూర్తి చేసి మొత్తం ప్రతి స్కూలులో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టీచర్లను నియమించారని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ మత్తు పదార్థాలు మితిమీరిపోయాయని వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని డ్రగ్స్ నివారణ కోసం పోరాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు శైలజ ఉపాధ్యాయుడు మరియానందం, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Post a Comment