తక్షణమే ఇంటరిమ్ రిలీఫ్ (ఐఆర్) ప్రకటించాలి...ఆప్తా...
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యలపై దృష్టిసారించి,పీఆర్సీ చైర్మన్ ను వెంటనే నియమించాలని,అలాగే ఇంటరిమ్ రిలీఫ్ (ఐఆర్) ప్రకటించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు యం.మధుసూదన రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆర్.సేవలాల్ నాయక్ లు గురువారం ఒక ప్రకటనలో కోరారు.
సరెండర్ లీవులు తదితర బకాయిలను చెల్లించి,'పెండింగ్ డీఏలను మంజూరు చేయాలన్నారు.కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం,2004,సెప్టెంబర్ కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు,పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వ హామీకి అనుగుణంగా సీపీఎస్ రద్దుకు పరిష్కారం చూపే రోడ్ మ్యాప్ ప్రకటించాలన్నారు.ఎం.టి.ఎస్ ఉపాధ్యాయులకు 62 సం..లకు సర్వీస్ పెంచి,రెగ్యులర్ చేయాలని,పదవీ విరమణ పొందే ఉద్యోగ,ఉపాధ్యాయులకు వెంటనే గ్రాట్యుటీ చెల్లించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment