అమావాస్య పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలోప్రత్యేకపూజలు,అన్నదానం...దాసరి మోహన్,ఆలయ కమిటీ చైర్మన్...
VS9TV న్యూస్,కల్లూరు :
కల్లూరు అర్బన్ పరిధి,32వ వార్డ్,ముజఫర్ నగర్,శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య పురస్కరించుకొని శుక్రవారం ప్రత్యేక పూజలు,అన్నదానం కార్యక్రమం చేపట్టినట్లు ఆలయ కమిటీ చైర్మన్ దాసరి మోహన్ పేర్కొన్నారు.
ఈ సందర్బంగా దాసరి మోహన్ మాట్లాడుతూ కమిటీ బృందం వడ్డె ఆంజనేయులు,వి.విజయ్ కుమార్, వి.చంద్ర,వి.నరసింహులు,వి.కృష్ణ, టి.నాగిరెడ్డిలతోకలిసి ఆలయంలో దాతల సహకారంతో ప్రతి నెల అమావాస్య, హనుమాన్ జయంతి, శ్రీరామనవమి పర్వదినాలలో ప్రత్యేక పూజలు,అన్నదానం కార్యక్రమం జరుపుతున్నట్లు చెప్పారు.అదేవిధంగా ఈ అమావాస్య నందు ఆలయం పూజారి విరుపాక్షయ్య ప్రత్యేక పూజల తరువాత వీర గోత్రం,శంకరప్ప, హైమావతి వారి కుటుంబ సభ్యులు రాజశేఖర్,సరిత, నాగేంద్ర,చాముండేశ్వరి, తేజేశ్వర్,రామసాయి,భువనేశ్వర్ లు
ఏర్పాటుచేసినట్లు చెప్పారు.అనంతరం దాతలు శంకరప్ప,హైమావతి దంపతులను ఆలయ కమిటీ బృందం శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు.
Comments
Post a Comment