కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్ గా ఆప్టా సేవలాల్ నాయక్...
ఫ్యాప్టొ రాష్ట కార్యవర్గ ఆదేశాల ప్రకారం 2025 -27 కుగాను కర్నూలు జిల్లా ఫ్యాప్టో కార్యవర్గ ఎన్నిక కర్నూలు జిల్లా ఎస్ టీయు భవన్ యందు బుధవారం జరిగింది.కార్యక్రమానికి రాష్ట్ర పరిశీలకుడుగా రాష్ట్ర ప్యాప్తో కో ఛైర్మన్, కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఇంచార్జి కాకి ప్రకాష్ రావు,13సభ్య సంఘాల జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు.ఇందులో ఎపి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్(ఆప్టా) జిల్లా ప్రధాన కార్యదర్శి సేవాలాల్ నాయక్, ఫెప్టో కర్నూలు జిల్లా ఛైర్మన్,సెక్రెటరీ జనరల్ జి.భాస్కర్ (బిటిఎ),కో ఛైర్మన్ లు వై. నారాయణ (హెచ్ ఎంఎ),వి.జి.వెంకట రాముడు (డిటిఎఫ్),ఎస్.గులాబ్ భాష (రూట),రాజేష్ (ఎస్ సి/ఎస్ టి యూనియన్) డిప్యూటీ సెక్రటరీ జనరల్ యు.రవికుమార్ (యుటిఎఫ్),టి.కె. జనార్ధన్ (ఎస్ టియు),ఎస్.ఇస్మాయిల్ (ఎపిటిఎఫ్ 1938),కోశాధికారి ఎన్.రంగన్న (ఎపిటిఎఫ్ 257) నుండి ఎన్నిక కావటం జరిగింది.ఈ ఎన్నిక కార్యక్రమంలో నవీన్ పాటిల్ (యుటిఎఫ్),ఎస్.గోకారి (ఎస్ టియు), మరియనందం(ఎపి టిఎఫ్ 1938),తిమ్మప్ప (డిటిఎఫ్) మధుసుధన్ రెడ్డి (ఆప్టా),జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Comments
Post a Comment