ఆప్కోమాజీ డైరెక్టర్,కల్లూరు మాజీ సర్పంచ్ పోలిశెట్టి నాగలక్ష్మయ్య మృతి...
VS9TV న్యూస్,కల్లూరు :
ఆప్కో మాజీ డైరెక్టర్,గోల కల్లూరు మాజీ సర్పంచ్,శ్రీ చౌడేశ్వరి దేవి వసతి సముదాయం శ్రీశైలం అధ్యక్షులు పోలిశెట్టి నాగలక్ష్మయ్య (74) అనారోగ్యంతో శుక్రవారం స్వర్గస్తులయ్యారు.వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని బంధుమిత్రులు కల్లూరు ప్రజలు భగవంతుని,కోరారు.25 సంవత్సరాల నుంచి ఆప్కో డైరెక్టర్ గా, అఖిలభారత తొగట వీర క్షత్రియ సేవా సంఘం శ్రీ చౌడేశ్వరి దేవి వసతి సముదాయం సత్రం శ్రీశైలం అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.పోలిశెట్టి నాగలక్ష్మయ్య అంతిమయాత్ర శనివారం ఉదయం 11-00గంటలకు వారి స్వగృహం కల్లూరు ఎస్టేట్ నుంచి ప్రారంభమై కల్లూరు స్మశాన వాటిక యందు అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది అని కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Post a Comment