జమ్ కేర్ కామినేని హాస్పటల్లో క్లిష్టమైన భుజం మార్పిడి ఆపరేషన్ విజయవంతం...

VA9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :

కర్నూలు నగరంలోని జమ్ కేర్ కామినేని హాస్పిటల్లో క్లిష్టమైన భుజం మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా చేశామని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ రవిబాబు తెలిపారు.నంద్యాల జిల్లా గాజులపల్లికి చెందిన జయమ్మ అనే పేషెంట్ కు గత సంవత్సరం జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ లో మోకాలు మార్పిడి చేశామని,ఆమెకు 6నెలల నుండి కీళ్ల నొప్పులు అధికమై చెయ్యి కూడా పైకి ఎత్తలేని పరిస్థితుల్లో హాస్పిటల్ లో చేరిందని.ఆమెకు ఎమ్మారై, ఎక్స్ రే అన్ని రకాల టెస్టులు చేసిన అనంతరం కుడి భుజం ఎముకలు పూర్తిగా అరిగి పోయినట్లు నిర్దారణ జరిగిందన్నారు.ఈ వ్యాధిని ఆంకలోసిస్ అంటారని,దీనికి ఉత్తమ చికిత్స భుజం మార్పిడి చేయడమేనని,భుజం మార్పిడి ఆపరేషన్ చాలా క్లిష్టమైనదన్నారు.ఈ ఆపరేషన్ ప్రముఖ నగరాలైన హైదరాబాదు,బెంగళూరు తదితర ప్రాంతాల్లో మాత్రమే చేస్తున్నారని,ఈ ఆపరేషన్ ఇప్పుడు కర్నూలు నగరంలో జమ్ కేర్ కామినేని హాస్పిటల్ లో చేశామని డాక్టర్ రవిబాబు తెలిపారు. భుజం మార్పిడిలో కాంప్లెక్స్ ప్రొసీజర్ రివర్స్ షోల్డర్ ఆర్థోప్లాస్టి చేశారు.దీనివల్ల రోగికి భుజం కదలిక పూర్తిగా వచ్చింది. ప్రస్తుతం పేషంటు ఫిజియోథెరపీ చికిత్సతో కోలుకుంటున్నదని డాక్టర్ రవి బాబు తెలిపారు.ఈ ఆపరేషన్ లో మత్తు డాక్టర్లు ఆదిత్య,మాధవి తదితర బృందం పాల్గొన్నారు.ఎటువంటి కీళ్లు,ఎముకలు వ్యాధులకైనా జెమ్ కేర్ హాస్పిటల్ లో అత్యుత్తమ చికిత్సలు,ఆపరేషన్ లు చేస్తామన్నారు.జమ్ కేర్ కామినేని హాస్పిటల్ లో క్లిష్టమైన భుజం మార్పిడి ఆపరేషన్ విజయవంతం చేసినందుకు డాక్టర్ చంద్రశేఖర్,డాక్టర్ బాలమురళీకృష్ణ,డాక్టర్ రామమోహన్ రెడ్డి,డాక్టర్ రాఘవేంద్ర,డాక్టర్ ఆదిత్య, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ గణేష్, నదీమ్, కృష్ణవేణి,ఆపరేషన్ చేసిన డాక్టర్ రవిబాబుకు,సిబ్బందికి అభినందనలు తెలిపారు.డాక్టర్ రవిబాబు గురించి క్లుప్తంగా చెప్పాలంటే డాక్టర్ రవిబాబు ఎంబీబీఎస్,ఎం.ఎస్.కర్నూలు నగరంలోని మెడికల్ కాలేజీలో చదివారు. ఫెలో షిప్,స్పోర్ట్స్ ఇంజురీస్,ఆర్తో ప్లాస్టి బెంగళూరు కేరళలో పూర్తి చేశారు. అబ్జర్వర్షిప్ జర్మనీ,సింగపూర్ లో చేశారు. ఇప్పుడు కర్నూలు నగరంలోని జెమ్ కేర్ కామినేని హాస్పిటల్లో అత్యుత్తమ సేవలందిస్తున్నట్లు వారు తెలిపారు

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...