బహిరంగ మద్యపానంపై డ్రోన్ తో నిరంతరం నిఘా...
బహిరంగ మద్యపానంపై ఉక్కు పాదం మోపుతున్న మంగళగిరి గ్రామీణ పోలీసులు
ప్రజా జనజీవనానికి వారి స్వేచ్ఛకు భంగం కలిగిస్తే కఠినచర్యలు తప్పవు
మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్
VS9TV న్యూస్,మంగళగిరి క్రైం :
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్,నార్త్ డిఎస్పి సి.హెచ్.మురళీకృష్ణ మంగళగిరి రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు బుధవారం మంగళగిరి మండలం,కాజా గ్రామ శివారులోని డొంకలలో నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్ గస్తీ నిర్వహించి బహిరంగ మద్యపానం చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్బంగా మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్ మాట్లాడారు.ప్రజా శాంతికి,వారి స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా బహిరంగ మద్యపానం చేయడం చట్టరీత్యా నేరం అని అన్నారు.మండల పరిధిలో నిరంతర డ్రోన్ గస్తీ నిర్వహణతో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని, బహిరంగ మద్యపానం సేవిస్తే కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంగళగిరి రూరల్ ఎస్సై సి.హెచ్.వెంకట్ హెచ్చరించారు.
Comments
Post a Comment