ఆస్తి పన్నుకు మాత్రమే 50శాతం వడ్డీ మాఫీ...
ఈ నెలాఖరులోగా ఏకమొత్తంలో చెల్లిస్తేనే వర్తింపు...
సెలవు దినాల్లో సైతం పన్ను వసూళ్లు..
ఆర్.జి.వి.క్రిష్ణ,నగరపాలక అదనపు కమిషనర్...
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
భవనాలు,ఖాళీ స్థలాలపై ఉన్న బకాయిలకు మాత్రమే 50శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుందని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ స్పష్టం చేశారు.బుధవారం ఆయన నగరపాలక కార్యాలయంలోని పన్ను వసూళ్లు కేంద్రాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...భవనాలు,ఖాళీ స్థలాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు,పాత బకాయిలన్నీ ఏక మొత్తంలో చెల్లిస్తేనే 50శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుందని తెలిపారు.ఇప్పటికే వడ్డీతో చెల్లించిన బకాయిదారులకు,వచ్చే ఆర్థిక సంవత్సరంలో సర్దుబాటు చేయడం జరుగుతుందన్నారు.ఈ నెల 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని,ఆదివారం ఉగాది,సోమవారం రంజాన్ దినాల్లో సైతం పన్ను వసూళ్లు కేంద్రాలు, ప్రత్యేక కౌంటర్లు తెరిచే ఉంటాయన్నారు.ఈ నెలాఖరున రాష్ట్ర వ్యాప్తంగా పన్ను చెల్లింపుదార్ల రద్దీ ఎక్కువగా ఉండొచ్చని, కావున బకాయిదారులు చివరి వరకు వేచి ఉండొద్దని సూచించారు.సత్వరమే పన్నులు చెల్లించి,50శాతం వడ్డీ రాయితీ పొందాలని అదనపు కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ యన్.చిన్నరాముడు పాల్గొన్నారు.
Comments
Post a Comment