దక్షిణ షిరిడీ సాయి మందిరంలో ఘనంగా ఉగాది వేడుకలకు ఏర్పాట్లు...
మహాబలేష్,ఓం సాయి రామ్ సాయిబాబా భక్తి మండలి ప్రధాన కార్యదర్శి
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరం,పాతబస్తీ,షిరిడీ సాయి మందిరంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఓం సాయి రామ్ సాయిబాబా భక్తి మండలి ప్రధాన కార్యదర్శి మహాబలేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ నెల 30, ఆదివారం కర్నూలు దక్షిణ షిరిడిగా పేరుగాంచిన మన శిరిడి సాయిబాబా దేవస్థానం నందు తెలుగు నూతన స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది వేడుకలను సాయి భక్తులచే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు.
కార్యక్రమాలు :
1.ఉ.11.00 సాయి సత్సంగం
2.సా. 6:30 సంధ్యా హారతి
3.సా.7.00 చిన్నారుల చేత నృత్య ప్రదర్శన
4.రా 8.00 పల్లకి సేవ రథోత్సవము ఏర్పాటు చేయడమైనది కావున సాయి బంధువులు భగవద్ బంధువులందరు ఈ కార్యక్రమం పాల్గొని ఆ సాయినాథ కృపకు అందరూ పాత్రలు కావలసిందిగా కోరారు.
గమనిక : కార్యక్రమానంతరం బాబా తరపున ఉగాది పచ్చడి ఏర్పటుచేయడమైనది.
Comments
Post a Comment