వీరబ్రహ్మేంద్రస్వామి,జగన్మాత ఈశ్వరి మహాదేవిని దర్శించుకున్న విశ్వబ్రాహ్మణ అభివృద్ధి మరియు సంక్షేమ కార్పొరేషన్ చైర్ పర్సన్ కే.పార్వతమ్మ...
వీరబ్రహ్మేంద్రస్వామి,జగన్మాత ఈశ్వరి మహాదేవిని దర్శించుకున్నవిశ్వబ్రాహ్మణ అభివృద్ధి మరియు సంక్షేమ కార్పొరేషన్ చైర్ పర్సన్ కే.పార్వతమ్మ
కడప జిల్లా,కందిమల్లయపల్లి జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మ ఠంలో వీరబ్రహ్మేంద్ర స్వామివారిని,శ్రీ జగన్మాత ఈశ్వరి మహాదేవి అమ్మవారిని శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అభివృద్ధి మరియు సంక్షేమ కార్పొరేషన్ చైర్ పర్సన్ కే.పార్వతమ్మ,కడప జిల్లా కార్పొరేషన్ డైరెక్టర్ వడ్ల శ్రీనివాస్ ఆచారిలు దర్శించుకొని ప్ర త్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఇటీవల అధిక వర్షాలకు స్వామివారు నివసిం చిన గృహం పడిపోయిన విషయం విదితమే.ఆ నివాస గృహాన్ని అధికారులు,స్వామి వా రి కుటుంబ సభ్యులు,గ్రామ పెద్దలతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ స్వామి వారు నివసించిన గృహంను గతంలో ఉన్నట్లుగానే పునరుద్ధరణ చే యాలని,భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్మించాలని,స్వామి వారు వాడిన పరిక రాలను ఒక మ్యూజియంగా ఏర్పాటు చేసి అందులో ఉంచాలన్నారు.వీరబ్రహ్మేంద్రస్వామి మఠం,జగన్మాత ఈశ్వరి మహాదేవి మఠం పరిసర ప్రాంతాలను గొప్ప పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కె.సత్యనారాయణ,శోభన్ బా బు,సుతారి రాఘవేంద్ర ఆచారి,కె.రామాచారి విశ్వకర్మ,బంగారు విశ్వరూప ఆచారి,వీర భద్ర స్వామి,సంపత్ స్వామి,వీరంబుట్లయ్య స్వామి,దత్తాత్రేయ స్వామి,సుంకు సురేష్,త దితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment