పత్రికా విలేకరిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం...
పత్రికా విలేకరిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా ఉన్న మీడియాపై దాడులకు పాల్పడ డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సింగనమల మండల ఏపీయూడబ్ల్యూజే ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా జ ర్నలిస్టులు పేర్కొన్నారు.ప్రజా సమస్యల పరిష్కార వేదికలో శింగనమల తహసిల్దార్ శే షారెడ్డిని కలిసి వారు వినతి పత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ సమా జంలో జరుగుతున్న పరిణామాలపై వార్తలు రాసే స్వేఛ్చ పత్రికలకు ఉంటుందని,పేపర్లలో తమకు వ్యతిరేక వార్తలు వస్తే,వాటికి ఖండనలు ఇవ్వటం,వివరణలు ఇవ్వటం చేయాలి. కానీ బెదిరింపులకు,భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్యంలో సరికాదని,తక్షణమే పత్రి కా విలేఖరిపై బెదిరింపులకి దిగిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాశక్తి రిపోర్టర్ పెద్దన్నపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇలాం టి చర్యలు పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది.పత్రికా విలేకరులు అనేక కోణాల్లో వారికి తెలిసిన విషయాలను వార్తలుగా రాస్తారు.వాటిలో ఎవరికైనా నొప్పించే విషయం వుంటే తగిన రీతిలో ప్రశ్నించాలి,లేదా ఫిర్యాదు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏం.బాల రంగారెడ్డి,జర్నలిస్ట్ లు ఆర్.మునెప్ప, ఎన్.నగేష్,ఏం.నాగేశ్వరరావు,టి.శంకర్,ఎం.ఆదినారాయణ,సి.సూర్యచంద్రారెడ్డి,ఓబులే సు,నాగశేషు,హరి,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment