క్రిప్టో కరెన్సీకి మోసానికి ప్రభుత్వ డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్య...
క్రిప్టో కరెన్సీకి మోసానికి ప్రభుత్వ డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్యస్నేహితులను నమ్మి ఫండ్ లో పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు భార్య ఆవేదన
VS9TV న్యూస్,కరీంనగర్ :
కరీంనగర్ నగారంలో క్రిప్టో కరెన్సీ మోసానికి ప్రభుత్వ వైద్యులు బలయ్యారు.ప్రతిమ ఆసు పత్రిలో అనస్తీషియా (మత్తు ) వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ఎంపటి శ్రీనివాస్ మత్తు ఇం జక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది...వివరాలు ఇలా ఉన్నాయి... మంకమ్మతోటకు చెందిన శ్రీనివాస్ గతంలో చొప్పదండి మెడికల్ ఆఫీసర్ గా పని చేశాడు.శ్రీనివాస్ భార్య విప్లవశ్రీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలుగా విధులు నిర్వహిస్తు న్నారు.తరచూ బ్యాంక్ అధికారులు ఇంటికి రావడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకు న్నాడని భార్య విప్లవశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.స్నేహితులతో కలిసి మెటా ఫండ్ లో డబ్బులు పెట్టాడని,కరుణాకర్,కిరణ్, గణేష్ అనే స్నేహితులకు కోట్లలో డబ్బులు ఇచ్చా డని భార్య ఆరోపించారు.తీసు కున్న రుణం చెల్లించకపోవడంతో బ్యాంక్ ఉద్యోగుల వే ధింపులు,స్నేహితులు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు బందు వులు తెలిపారు.పలురకాల బిజినెస్ లలో గణేష్,కిరణ్,కరుణాకర్ లు శ్రీనివాస్ తో డబ్బు లు పెట్టించి మోసం చేశారని ఆరోపించారు.వైద్యవృత్తిలో ఉండడంతో బ్యాంక్ రుణాలు తీయించారని చెప్పారు. సుమారు మూడు కోట్ల రూపాయల వరకు అప్పులు అయినట్లు తెలిపారు.గత పదేళ్లుగా ఈఎంఐలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment