మొంథా ఎఫెక్ట్...సముద్రంలో చిక్కుకున్న 600మందిని కాపాడిన అధికారులు...
మొంథా ఎఫెక్ట్...సముద్రంలో చిక్కుకున్న 600మందిని కాపాడిన అధికారులు
‘మొంథా’ తుపాను ప్రభావంతో ఒడిశా తీరంలో సముద్రంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్ర దేశ్కు చెందిన సుమారు 600మంది మత్స్యకారులను స్థానిక అధికారులు సురక్షితంగా కాపాడారు.భారీ వర్షాల కారణంగా ముందుకు కదల లేకపోయిన 60ట్రాలర్లను ఒడిశా యం త్రాంగం గోపాల్పుర్ ఓడరేవుకు తరలించింది.వివరాల్లోకి వెళితే...మొంథా తుపా ను కారణంగా ఒడిశాలోని గంజాం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ నే పథ్యంలో చేపల వేటకు వెళ్లిన ఏపీకి చెందిన మత్స్యకారులు ఛత్రపురం సమీపంలోని అ ర్జిపల్లి వద్ద సముద్రంలో చిక్కుకుపోయారు.విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.మొత్తం 60ట్రాలర్లను గోపాల్పుర్ ఓడరేవులో లంగర్లు వేసేందుకు ఏర్పాట్లు చేసింది.ఈ వివరాలను మత్స్యశాఖ ఉపసం చాలకులు సంగ్రామ్ కర్ విలేకరులకు వెల్లడించారు.మొత్తం 600మందినీ సురక్షితంగా ఒ డ్డుకు చేర్చామని,వారికి అవసరమైన ఆహారం,తాగునీరు,ఔషధాలు అందించామని ఆయ న తెలిపారు.తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు మత్స్యకారులకు అన్ని విధాలా అండ గా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ ఘటనపై గంజాం జిల్లా కలెక్టర్ కీర్తివాసన్ కూడా స్పం దించి,సహాయక చర్యలు,పునరావాస ఏర్పాట్లపై ఆరా తీశారు.ప్రస్తుతం మత్స్యకారులం తా గోపాల్పుర్ ఓడరేవులో సురక్షితంగా ఉన్నారు.
Comments
Post a Comment