అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం... కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన కర్నూలు పోలీసులు...
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంకొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన కర్నూలు పోలీసులు
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు నివాళులర్పిం చడం జరిగిం దని,పోలీసు అమరవీరుల త్యాగాలను మరవలేనివని అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్ అన్నారు.జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి క ర్నూలు పట్టణంలో పోలీసు అమరవీరులను స్మరిస్తూ కర్నూలు పోలీసులు కొవ్వొత్తుల ర్యా లీ కార్యక్రమం చేపట్టారు.పోలీసు అమరవీరులను స్మరిస్తూ పోలీసు కార్యాలయంలోని పోలీసు అమరవీరుల స్ధూపం వద్ద కొవ్వొత్తులను ఉంచి పోలీసు అమరవీరులకు నివాళు లర్పించారు.జిల్లా పోలీసు కార్యాలయం-కర్నూలు కొండారెడ్డి బురుజు నుండి పెద్ద మా ర్కెట్ రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు పోలీసు బ్యాండ్ మధ్య పోలీసు అధికా రులు సిబ్బంది,కొవ్వొత్తుల ర్యాలీ కొనసాగిందారు.ఈ సందర్బంగా అడిషనల్ ఎస్పీ హుస్సే న్ పీరా మాట్లాడుతూ...అమరులైన పోలీసు త్యాగాలను మనమందరం గుర్తు చేసుకుం టూ కొవ్వొత్తుల ర్యాలీని చేపట్టడం జరిగిందన్నారు.పోలీసుల అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈనెల 21 నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు పోలీసు లు చేపట్టారన్నారు.పోలీసు అమరవీరులకు జోహార్ లు అంటూ నినాదాలు చేస్తూ కొవ్వొ త్తుల ర్యాలీ నిర్వహించిన్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్,ఎపిఎస్పీ 2వ బెటాలియన్ డిఎస్పీలు ఎస్.ఎమ్.భాషా,రవికిరణ్,వెంకటశి వుడు,వెంకటరమణ,సిఐలు,ఆర్ ఐలు,ఎస్సైలు,ఎపిఎస్పీ ఎస్ డిఆర్ ఎఫ్,ఎఆర్,సివిల్ పోలీ సు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment