ఖమ్మం జిల్లాలో సిపిఎం నేత దారుణ హత్య...
ఖమ్మం జిల్లాలో సిపిఎం నేత దారుణ హత్య
ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.మధిర శాసనసభ నియోజకవర్గం చిం తకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సిపిఎం సీనియర్ నేత సా మినేని రామారావును అత్యంత పాశవికంగా గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే...సామినేని రామారావు రోజూ మాదిరిగానే శుక్రవారం మార్నింగ్ వాక్ కు వెళ్లారు.ఆ సమ యంలో మార్గమధ్యంలో ఆయన్ను అడ్డగించిన దుండగులు,పదునైన ఆయుధంతో గొంతుకోసి హతమార్చారు.రక్తపు మడుగులో పడివున్న ఆయన్ను గమనిం చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.పరిసరాలను పరిశీలించి, సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడ్డారు.హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.ఈ హత్య వెనుక రాజకీయ లేదా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యా ప్తు ప్రారంభించారు.ఈ ఘటనతో పాతర్ల పాడు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొం ది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Post a Comment