అధునాతన ట్రాఫిక్ నియంత్రణ బారికేడ్స్ ను ప్రారంభం...ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలి...విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ...
అధునాతన ట్రాఫిక్ నియంత్రణ బారికేడ్స్ ను ప్రారంభంప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలివిక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ
ట్రాఫిక్ క్రమబద్దీకరణకు,రహదారి భద్రత నిబంధనలపై పకడ్బందీ చర్యలు తీసుకుంటు న్నామని ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.శుక్రవారం కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ని ర్వహించిన అధునాతన ట్రాఫిక్ నియంత్రణ బారికేడ్ పరికరాలను కర్నూలు స్థానిక కొం డారెడ్డి బురుజు వద్ద కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రారంభించారు.ఈ సంధర్బం గా విలేకరులతో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ...కర్నూలు ట్రాఫిక్ పోలీసు లు వినూత్నమైన కార్యక్రమం చేపట్టారన్నారు.
ప్రజలకు,విద్యార్దులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకు న్నామన్నారు.విద్యార్దులు ట్రాఫిక్ ఉల్లంఘనలు చేయకుండా అవగాహన కల్పించేందుకు ఒక ట్రాఫిక్ నమూనాను ఏర్పాటు చేశామన్నారు.జాతీయ రహాదారులలో రోడ్డు ప్రమా దాల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఈ నమూనాను కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఆవిష్కరించామన్నారు.ఈ ట్రాఫిక్ నమూనాను విద్యాసంస్థల వద్దకు తీసుకువెళ్ళి లైవ్ డెమో ఇచ్చి రహదారి నిబంధనలపై విద్యార్థులకు అవగాహన క ల్పిస్తామన్నారు.రాంగ్ పార్కింగ్,సిగ్నల్ జంపింగ్ వంటివి చేయకుండా ఎలా ఉండాలి అనే విషయంపై ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తామన్నారు.సామాజిక భాద్యత కలి గిన (జెమ్ కేర్ కామినేని హాస్పిటల్,కిమ్స్ హాస్పిటల్,బాలాజీ ఆయిల్స్,వస్త్రాలయ షా పింగ్ మాల్) దాతల సహాకారంతో ట్రాఫిక్ నియంత్రణకు 80బారికేడ్స్ ను అందించార న్నారు.
వారికి ధన్యవాధాలు తెలియజేస్తున్నామన్నారు.రాబోయే రోజుల్లో కర్నూలు పట్టణంలో ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహాకరించాలన్నారు.ముందుగా ట్రాఫిక్ పోలీసులు,షో రూమ్ ల యువకులు కలిసి హెల్మెట్ పై అవగాహనకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
Comments
Post a Comment