త్వరలో టాటా టూ వీలర్లు...దేశీయ ఆటో రంగ దిగ్గజం టాటా మోటర్స్...
త్వరలో టాటా టూవీలర్లుదేశీయ ఆటో రంగ దిగ్గజం టాటా మోటర్స్
ద్విచక్ర వాహనాల తయారీలోకి రాబోతున్నదని,సంప్రదాయ బైకులతోపాటు విద్యుత్తు ఆ ధారిత (ఈవీ) టూవీలర్లను మార్కెట్కు పరిచయం చేయబోతున్నదన్న వార్తలు బుధవా రం పలు సోషల్ మీడియా వేదికల్లో హల్చల్ చేశాయి.ఇప్పటికే భారీ,మధ్యశ్రేణి,తేలిక పాటి వాణిజ్య వాహనాలు,ప్యాసింజర్ కార్ల తయారీలో దూసుకుపోతున్న టాటా మోట ర్స్...ఇక టూవీలర్ సెగ్మెంట్లోకి ప్రవేశించబో తున్నట్లు,ఈ క్రమంలోనే ముందుగా 110 సీసీ,125సీసీ బైకులను అందుబా టులోకి తేనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. 110సీసీ బైక్ ధర రూ.45,999గా,125సీసీ బైక్ ధర రూ.55,999గా ఉండొచ్చన్న అం చనాలూ వినిపిస్తుండటం గమనార్హం.ఇవి లీటర్ పెట్రోల్కు 90కిలోమీటర్ల మైలేజీ ఇస్తా యనీ అంటున్నారు.అలాగే సింగిల్ చార్జింగ్పై 280 కిలోమీటర్లు ప్రయాణించే లా టాటా బ్రాండ్ ఎలక్ట్రిక్ టూవీలర్లూ వస్తాయని చెప్తుండటం విశేషం.అయితే వీటి ధర కేవలం రూ. 85,000గానే ఉండొచ్చని ఆయా వెబ్సైట్లు పేర్కొంటున్నాయి.కాగా హీరో మోటో కార్ప్, హోండా మోటర్సైకిల్,బజాజ్, టీవీఎస్లకు పోటీగా వచ్చే ఏడాది ఇవి దేశీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తాయని అంచనా...
Comments
Post a Comment