హరీశ్ రావును పరామర్శించిన కవిత...

హరీశ్ రావును పరామర్శించిన కవిత

VS9TV న్యూస్,హైదరాబాద్ :
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి నేప థ్యంలో పలువురు నేతలు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ప్రముఖులు హాజర య్యారు.ఈ క్రమంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు,ఎమ్మెల్సీ కవిత తన భర్త అని ల్‌తో కలిసి హరీశ్‌రావు నివాసానికి వెళ్లారు.వారు ముందుగా సత్యనారాయణ చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం హరీశ్‌రావు కుటుంబ సభ్యు లను ఓదార్చారు.కుటుంబ బాధలో భాగస్వామ్యం అవుతూ,ధైర్యంగా ఉండాలని కవిత అ భ్యర్థించినట్లు సమాచారం.ఈ సందర్శన పూర్తిగా వ్యక్తిగతంగా జరిగినప్పటికీ,రాజకీ య వర్గాల్లో ఇది పెద్ద చర్చకు దారి తీసింది.గత కొంతకాలంగా హరీశ్‌రావు,కవిత మధ్య రాజకీయ విభేదాలు స్పష్టంగా కనబడుతున్నాయి.ముఖ్యంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అక్రమాల విషయంలో కవిత హరీశ్‌రావుపై తీవ్రవ్యాఖ్యలు చేసిన సంగతి తెలి సిందే.ఆ సమయంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం చెలరేగి,బీఆర్‌ఎస్‌ అంతర్గతం గా కూడా కలకలం రేపింది.ఈ నేపథ్యంలో కవిత తాజా పరామర్శ రాజకీయ వర్గాల్లో మళ్లీ కొత్త ఊహాగానాలకు తావిచ్చింది.పార్టీ లోపల ఉన్న విభేదాలు చల్లబడుతున్నా యా? లేక ఇది కేవలం మానవతా దృక్పథంలోనూ జరిగిన చర్యనా? అనే ప్రశ్నలు వి నిపిస్తున్నాయి.పరిశీలకుల అభిప్రాయం ప్రకారం,కవిత పర్యటన వ్యక్తిగతమైనదే అయిన ప్పటికీ,బీఆర్‌ఎస్‌లోని అంతర్గత వాతావరణం మారుతోందనే సంకేతంగా దీనిని చూడ వచ్చని అంటున్నారు.ఎన్నికల తర్వాత పార్టీని బలోపేతం చేయడానికి కవిత,హరీశ్‌ రా వు వంటి ప్రముఖ నేతల మధ్య మళ్లీ సమన్వయం అవసరమని భావిస్తున్నారు.హరీశ్‌ రావు కూడా కవిత పట్ల సానుకూల ధోరణి ప్రదర్శించారని పార్టీ వర్గాలు చెబుతున్నా యి.ఈ పరిణామం బీఆర్‌ఎస్‌లో కొత్త ఐక్యతకు దారితీయవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....