హైదరాబాద్లో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కలకలం...
హైదరాబాద్లో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కలకలం
హైదరాబాద్లో ఐటీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.తాను ఉంటున్న నివాసం 14 అంతస్తు బిల్డింగ్ పై నుంచి దూకి ఇంజనీర్ మరణించాడు.ఈ విషాద ఘట న చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం...స్థానికంగా నివాసం ఉంటున్న శ్రీనివాసరావు హుజూర్నగర్ వాసి.గత కొన్ని సంవత్సరాలుగా హైద రాబాదులోని స్థిరపడ్డాడు.స్థానికంగా నల్లగండ్లలో ఉన్న రాంకీ గెలాక్సీయా అపార్ట్మెంట్స్ లోని 14అంతస్తులో ఆయన నివాసం ఉంటున్నాడు.కొద్దిరోజులుగా భార్యతో తరచూ శ్రీ నివాస్ రావుకి గొడవలు అవుతున్నాయి.ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్ద మనుషులు వచ్చి ఇరువురికి నచ్చచెప్పి పంచాయితీ చేసినా ఫలితం లేదు.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్న ప్పటికీ నిరంతరం ఆస్తి విషయంలో గొడవలు అవుతూనే ఉండేవి.ఈ నేపథ్యంలో అపా ర్ట్మెంట్ 14ఫ్లోర్ నుండి శ్రీనివాసరావు కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తీవ్రగా యాలతో ఘటన స్థలంలోనే శ్రీనివాసరావు మృతి చెందాడు.
Comments
Post a Comment