ఏపీ రైతులను నిండా ముంచిన మొంథా తుఫాన్...రూ.5,265కోట్లు నష్టం... చంద్రబాబు,రాష్ట్ర ముఖ్యమంత్రి...
ఏపీ రైతులను నిండా ముంచిన మొంథా తుఫాన్రూ.5, 265కోట్లు నష్టంచంద్రబాబు,రాష్ట్ర ముఖ్యమంత్రి
మొంథా తుపాను ఏపీలో విధ్వంసం సృష్టించింది.భారీగానే నష్టం మిగిల్చింది.మొంథా తు ఫాను మిగిల్చిన నష్టంపై ఏపీ సర్కార్ ప్రాథమిక అంచనా వేసింది.ప్రాథమిక నష్టం అంచ నా దాదాపు రూ.5, 265 కోట్లుగా తేల్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.ఆర్ అండ్ బీకి రూ.2,079 కోట్ల నష్టం జరిగిందన్నారు. ఆక్వా రంగంలో రూ.1,270కోట్ల నష్టం వాటి ల్లిందన్నారు.ఇక వ్యవసాయ రంగంలో రూ.829కోట్లు,మున్సిపల్ శాఖలో 109 కోట్లు, సెరికల్చర్ రంగంలో రూ.65 కోట్ల నష్టం జరిగిందన్నారు.హార్టికల్చర్ రంగంలో రూ.39 కో ట్ల నష్టం జరగ్గా...పశుసంవర్ధక శాఖలో రూ.71 లక్షల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచ నా వేసింది ప్రభుత్వం.తుపాను వల్ల 120పశువులు చనిపోయాయి.కాగా,తుపాను వల్ల మనుషులు ఎవరూ చనిపోలేదని వెల్లడించారు.టెక్నాలజీ సాయంతో తుపాను నష్టాన్ని తగ్గించామని సీఎం చంద్రబాబు చెప్పారు. శాటిలైట్ ఇమేజ్ ల ద్వారా తుపాను పరిస్థితి ని అంచనా వేశామన్నారు. మొంథా తుఫాన్ బీభత్సాన్ని ముందుగానే అంచనా వేసి నష్ట నివారణ చేయగలిగామన్నారు.రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా,గ్రామ స్థాయి వరకు వ్యవస్థను ఏ ర్పాటు చేశామని తెలిపారు.తుపాను వల్ల మారుతున్న పరిణామాలకు తగ్గట్లుగా నిర్ణయా లు తీసుకున్నా మని వెల్లడించారు. హుద్ హుద్ తుపానుతో విశాఖ అతలాకుత లమైంద ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.వారం రోజుల్లోనే పరిస్థితులను చక్కదిద్దామన్నారు. తిత్లీ తుపాను సమయంలోనూ సమర్థంగా పని చేశామన్నారు.బుడమేరు వరదను ఎదు ర్కొన్నామన్నారు.విపత్తు సమయాల్లో టెక్నాలజీని సమర్థంగా వాడుతున్నామన్నారు.మొం థా తుఫాను దాగుడుమూతలు ఆడిందని సీఎం చంద్రబాబు పేర్కొ న్నారు.
Comments
Post a Comment