మావోయిస్టుల ఫండింగ్ గుట్టురట్టు...రూ.400 కోట్ల నిధులు,400కిలోల బంగారం...

మావోయిస్టుల ఫండింగ్ గుట్టురట్టు
రూ.400 కోట్ల నిధులు,400కిలోల బంగారం
ఆపరేషన్ కగార్‌తో లొంగుబాట పడుతున్న మావోయిస్టులు
వందల కోట్ల పార్టీ ఫండ్‌ను బంగారంగా మార్చినట్లు అనుమానం
డొల్ల కంపెనీలు,బినామీ ఖాతాలతో నిధుల మళ్లింపు
లొంగిపోయిన మావోల ద్వారా డబ్బు 
ఆచూకీపై నిఘా వర్గాల ఆరా
ప్రాణభయంతోనే లొంగుబాటు
ఆర్థిక ఇబ్బందులతో కాదంటున్న పోలీసులు

VS9TV న్యూస్,హైదరాబాద్ :
భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ దెబ్బకు మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అ వుతోంది.అగ్రనేతల నుంచి సాధారణ దళ సభ్యుల వరకు పెద్ద సంఖ్యలో లొంగుబాట ప డుతుండటంతో వారి భారీ ఆర్థిక సామ్రాజ్యం గుట్టు మెల్లగా వీడుతోంది.మావోయిస్టులు వివిధ మార్గాల్లో వసూలు చేసిన వందల కోట్ల రూపాయల నగదును బంగారంగా మార్చే శారని,భారీగా బంగారు నిల్వలు దాచిపెట్టారని నిఘా వర్గాలు బలంగా అనుమానిస్తు న్నాయి.జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణలో అనేక విస్తుపోయే విషయాలు వె లుగులోకి వచ్చాయి.ఝార్ఖండ్,ఛత్తీస్‌గఢ్‌,తెలంగాణ,ఏపీ సహా పలు రాష్ట్రాల్లోని కాంట్రాక్ట ర్లు,వ్యాపారుల నుంచి సేకరించిన నిధులను మావోయిస్టులు రెండు మార్గాల్లో మళ్లిస్తున్న ట్లు అధికారులు గుర్తించారు.పార్టీ సానుభూతిపరులు,వారి కుటుంబస భ్యుల పేర్లతో డొల్ల కంపెనీలు,బ్యాంకు ఖాతాలు తెరిచి కోట్లాది రూపాయలను అందులోకి మళ్లిస్తున్నారు. మి గిలిన భారీ మొత్తాన్ని,ముఖ్యంగా కొవిడ్ సమయంలో,బంగారంగా మార్చి అడవుల్లోని డంపుల్లో లేదా సురక్షిత ప్రాంతాల్లో దాచిపెట్టినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టు ల వద్ద సుమారు రూ.400 కోట్ల నిధులు,400 కిలోల బంగారం నిల్వలు ఉండవచ్చని ని ఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇటీవల వెలుగు చూసిన కొన్ని ఘటనలు ఈ అనుమా నాలకు బలం చేకూరుస్తున్నాయి.ఝార్ఖండ్‌కు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం డియా (పీఎల్‌ఎఫ్‌ఐ) నేత దినేశ్‌ గోపే,తన భార్య బంధువుల పేరిట డొల్ల కంపెనీలు సృ ష్టించి రూ.20కోట్లకుపైగా మళ్లించి నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. అలాగే,గతంలో ఓ మావోయిస్టు నేత తన బంధువు వైద్య కళాశాల ఫీజు కోసం ఏకంగా రూ.1.13 కోట్లను బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీ చేసినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తే లింది.అయితే,మావోయిస్టులు లొంగిపోవడానికి ఆర్థిక ఇబ్బందులు కారణం కాదని పోలీ సు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.వారి వద్ద ఉన్న నిధులతో మరో ఐదారేళ్లు పార్టీని నడప గలరని,కానీ భద్రతా బలగాల ఆపరేషన్లతో ప్రాణభయం పెరిగిపోవడంతోనే లొంగుబాటు బాట పడుతున్నారని విశ్లేషిస్తున్నాయి.లొంగి పోయే ముందు తమ వద్ద ఉన్న డబ్బు,ఆ యుధాల లెక్కలను పార్టీకి అప్పగించి వస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టులను కేంద్ర,రాష్ట్ర నిఘా వర్గాల అధికారులు విచారిస్తూ...దాచి పెట్టిన డబ్బు, బంగారం డంపుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....