అక్రమ సంబంధం కోసం అమానుషం...భార్య,ఇద్దరు కుమారులు హత్య,...ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త...
అక్రమ సంబంధం కోసం అమానుషం
భార్య,ఇద్దరు కుమారులు హత్య,
ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త
హైదరాబాద్ నగరంలోని మూసాపేట పరిసర ప్రాం తంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని భావించి క ట్టుకున్న భార్యతో పాటు ఇద్దరు చిన్న కుమారులను హత్య చేసి,అనంతరం ఆ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించిన దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.స్థా నికులు తెలిపిన వివరాల ప్రకా రం,వరంగల్ జి ల్లా,చెన్నారావుపేట మండలం,బోడ మాణిక్యం తండాకు చెందిన బోడ స్రవంతి–ప్రవీణ్ దంప తులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.బోడ ప్రవీ ణ్,అదే తండాకు చెందిన బానోతు బద్రి–బిఖ్యా దం పతుల రెండో కుమార్తె స్రవంతిని ప్రేమ వివాహం చే సుకున్నారు.దాదాపు 14 సంవత్సరాల పాటు వారి దాంపత్య జీవితం సజావుగా సాగినప్పటికీ,గత రెం డు సంవత్సరాలుగా ప్రవీణ్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు సమాచారం.ఇదే క్రమంలో ఆ మహిళను రెండో వివాహం చేసుకున్న ప్రవీణ్,భార్యతో తరచూ గొడవలు పడుతూ దూరంగా ఉండేవాడు.కుటుంబ పెద్దలు పలుమార్లు పంచాయతీ నిర్వహించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.రెండు రోజుల క్రి తం నర్సంపేట ప్రాంతంలో మరోసారి పంచాయతీ జ రగగా,ఇకముందు ఎలాంటి సంఘటనలు జరిగినా పూర్తి బాధ్యత తనదేనని ఒప్పుకొని,బాండ్ పేపర్ రా సి భార్యను తనతో తీసుకెళ్లాడు. అయితే ఇదంతా ముందే పథకం ప్రకారమే జరి గిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సోమవారం హైదరాబాద్కు వె ళ్లిన అనంతరం,మంగళవారం రాత్రి భార్యను చిత్ర హింసలకు గురిచేసి,బిర్యానీలో విషం కలిపి ఇద్దరు కుమారులతో పాటు భార్యను హత్య చేసినట్లు ప్రాథ మిక సమాచారం.అనంతరం వారిని ఉరివేసుకుని ఆ త్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు న మోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.పూర్తి వివ రాలు తెలియాల్సి ఉంది.
Comments
Post a Comment