పెంచుకున్న పిల్లి మృతి... మనస్థాపంతో మహిళా ఆత్మహత్య...
పెంచుకున్న పిల్లి మృతి... మనస్థాపంతో మహిళా ఆత్మహత్య
నేటి సమాజంలో మానవ సంబంధాలు క్రమంగా దూ రమవుతూ,భావోద్వేగ పరమైన బలహీనతలు పెరు గుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది.కుటుంబ బంధాలు,స్నేహాలు తగ్గిపోతున్న సమయంలో పెంపు డు జంతువులపై అధిక మమకారం పెరగడం కొన్ని సార్లు ప్రమాదకర పరిణామాలకు దారితీస్తోందనే ఆం దోళన వ్యక్తమవుతోంది.మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి లోని బడంగ్ పేట్ ప్రాంతానికి చెందిన హిమబిందు (20) అనే యువతి బీఎస్సీ మొదటి సంవత్సరం చ దువుతోంది.గత రెండు సంవత్సరాలుగా ఆమె ఒక పెంపుడు పిల్లిని ఎంతో ప్రేమగా పెంచుకుంటూ వచ్చిం ది.ఆ పిల్లి ఆమెకు అత్యంత సన్నిహితంగా మారి,కు టుంబ సభ్యుల కంటే కూడా ఎక్కువగా అనుబంధం ఏర్పడింది.అయితే ఇటీవల ఆ పెంపుడు పిల్లి మృతి చెందడం హిమబిందును తీవ్రంగా కలచివేసింది.ఈ బాధను తట్టుకోలేక ఆమె తీవ్ర మ నస్థాపానికి గురైం ది.ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న ఎలుకల మందును తాగి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది.ఈ విష యం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమె ను సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ,అప్పటికే ఆమె మృతి చెంది నట్లు వైద్యులు నిర్ధారించారు.స మాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మా నియా ఆసుపత్రికి తరలించారు.అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తు న్నారు.ఈ ఘటనతో మరోసారి సమాజంలో పెరుగు తున్న ఒంటరితనం,భావోద్వేగ అస్థిరతపై చర్చ మొద లైంది.పెంపుడు జంతువులపై ప్రేమ సహజమే అయి నప్పటికీ, అది మానసికంగా అతిగా ఆధారపడే స్థా యికి చేరితే ఇలాంటి దుర్ఘటనలు సంభవించే ప్రమా దం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.గతంలో కూడా ఎటువంటి ఘటనలు రెండు జరిగాయని ని పుణులు పేర్కొన్నారు.కుటుంబ సభ్యులు,స్నేహితు లు ఒకరినొకరు అర్థం చేసుకుని,భావోద్వేగ పరమైన మద్దతు అందించాల్సిన అవసరం మరింతగా పెరిగిం దని వారు అభిప్రాయపడుతున్నారు.
Comments
Post a Comment