ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు...
ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది.కోర్టులో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా పంపారు.కోర్టులకు వరుసగా వస్తున్న బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి.ఇప్పటికే ఏపీ,తెలంగాణలో పలు జిల్లా కోర్టులకు బెదిరింపుల కలకలం రేపగా,సోమ వారం ములుగు జిల్లా కోర్టుకు కూడా అలాంటి హెచ్చ రిక వచ్చింది.ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరిం పు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.ఆ గంతకుల నుంచి ఈమెయిల్ రావడంతో వెంటనే చ ర్యలు ప్రారంభించారు.పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి,పూర్తిగా తనిఖీలు చేపట్టారు.బాంబ్ స్క్వాడ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రతి మూలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.ఈ ఘటనతో కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి.ఇటీవలి కాలంలో వరుసగా ఇలాంటి బెదిరింపు లు రావడంతో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్య వహరిస్తున్నారు.
Comments
Post a Comment