4.1 కేజీల గంజాయి పట్టువేత...ఒకరి అరెస్ట్ మరో ఎనిమిది మందిపై కేసు నమోదు...
4.1 కేజీల గంజాయి పట్టువేత
ఒకరి అరెస్ట్ మరో ఎనిమిది మందిపై కేసు నమోదు
గోల్కొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో లంగర్ హౌస్ ప్రాం తాల్లో మహారాష్ట్ర నుంచి గంజాయి దిగుమతి అ యిందన్న సమాచారం మేరకు ఎస్టిఎఫ్ ఏ టీం లీడర్ అంజిరెడ్డి సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మహమ్మద్ షఫీ (27) అనే యువకుడి వద్ద 4.1కేజీల గంజాయి,ఒక స్కూటీని స్వాధీనం చే సుకున్నారు.నిందితుడిని స్క్రూటీని గంజాయిని గో ల్కొండ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.మహారాష్ట్రకు చెందిన సల్మాన్ ఖాన్ వద్ద కిలోకి పదివేల చొప్పున కొనుగోలు చేసి గల్లీల్లో 10గ్రాముల గంజాయి పాకెట్ రూ.500లకు అమ్మకాలు జరుపుతూ షఫీ సొమ్ము చేసుకుంటున్నాడు.ఈ కేసులో జాఫర్,షేక్ అబ్దుల్లా, యాసిన్,సయ్యద్ ఇర్ఫాన్,మహమ్మద్ మోసిన్,జు బేద్,మహమ్మద్ బిన్ అలీపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఎస్సీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు.
Comments
Post a Comment