శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాంసీపీ సజ్జనార్...
శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం
సీపీ సజ్జనార్
శ్రీరామ నవమిని పురస్కరించుకుని ప్రతిఏటా హైదరాబాద్లో వైభవంగా శ్రీరాముని శోభాయా త్రను నిర్వహిస్తారు.ఈ సారి కూడా శోభయా త్రను నిర్వహించేందుకు సన్నాహలు ప్రారంభిం చారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఉత్సవ కమిటీ నిర్వహకులతో సమావేశం అయ్యారు.నగరంలో శ్రీరాముని శోభయాత్రలో నిర్వాహకులు కొన్ని ని యమాలను తప్పకుండా పాటించాలని చెప్పా రు.సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. 'శ్రీరామ నవమి ఉత్సవ కమిటితో సమన్వయ సమావేశం నిర్వ హించాం.16 ఏళ్లుగా శోభయాత్ర సమర్థ వంత గా,విజయవంతంగా జరుగుతుంది.ఈ సారి కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తాం.అందరి సహకారంతో ఈ యాత్రను ప్రశాంతంగా సాగేల ఏర్పాట్లు చేస్తున్నాం.శోభాయాత్ర కమిటీ కొన్ని విషయాలను మా ముందు ఉంచారు.వాటిని పరిశీలిస్తాం' అని ఆయన వెల్లడించారు.'అలానే ప్రభుత్వ, పోలీస్ శాఖ తరఫు నుంచి అన్ని ఏర్పా ట్లు పూర్తి చేస్తాం.శోభాయాత్రకు సుమారుగా 3000 మంది పోలీసులు భద్రత విధుల్లో ఉంటా రు.చైన్ స్నాచింగ్,ఇతర ఘటనలు జరగకుండా క్రైమ్ టీమ్స్ ను,షీ టీంలను మోహరిస్తాం. శోభాయాత్ర జరిగే తీరును డ్రోన్లతో పర్యవేక్షిస్తా మన్నారు.ఈ యాత్ర సాగే మార్గాలు సీసీ టీవీ ల ను ఏర్పాటు చేసి వాటి ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తాం.గతేడాది వెహికల్ బ్రేక్డౌన్ కార ణంగా శోభాయాత్ర నెమ్మదించింది.ఈసారి అ లాంటి సమస్యలు లేకుండా శోభాయాత్రను అ నుకున్న సమయానికి పూర్తిచేసేలా చర్యలు తీ సుకుంటాం' అని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
Comments
Post a Comment