ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల పేరుతో సైబర్ మో సా లు...అడ్మిషన్ గ్యారంటీ,తక్కువ ఫీజుతో సీటు కల్పి స్తాం అంటూ అమాయక విద్యార్థులు,తల్లి దండ్రులకు సైబర్ నేరగాళ్ల మోసాలు...కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్...
ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల పేరుతో సైబర్ మో సాలు.
అడ్మిషన్ గ్యారంటీ,తక్కువ ఫీజుతో సీటు కల్పిస్తాం అంటూ అమాయక విద్యార్థులు,తల్లిదండ్రులకు సైబర్ నేరగాళ్ల మోసాలు.
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
ఇంజనీరింగ్,మెడికల్,బీటెక్ సీట్ల పేరుతో అడ్వా న్స్ పేమెంట్లు తీసుకుంటూ జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.కొందరు సైబర్ నేరగాళ్లు ప్రముఖ కళాశాలలు,విశ్వ విద్యాల యాల పేరుతో ఫోన్ కాల్స్,వాట్సాప్ మెసేజ్లు, ఫేక్ వెబ్సైట్ల ద్వారా సంప్రదిస్తూ “మేనేజ్మెంట్ కోటా సీట్ల ” పేరుతో అడ్వాన్స్ బుకింగ్ డబ్బులు అడిగి మోసాలు చేస్తారన్నారు.అడ్మిషన్ గ్యారం టీ, తక్కువ ఫీజుతో సీటు కల్పిస్తామని చెప్పి అమాయక విద్యార్థులు, తల్లిదండ్రులను మోసా లు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయన్నారు .
జిల్లా ప్రజలకు ఎస్పీ సూచనలు :
*ఏ కళాశాల సీటు కోసం అయినా అధికారిక వెబ్సైట్ లేదా కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారానే దరఖాస్తు చేయాలి.
* ఫోన్ కాల్స్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఆఫర్లను నమ్మి డబ్బులు పంపవద్దు.
* వ్యక్తిగత బ్యాంక్ వివరాలు,ఓటీపీలు ఎవరికీ ఇవ్వకూడదు.
* అనుమానాస్పద లింకులు,ఏపీకె ఫైల్స్ డౌన్ లో డ్ చేయవద్దు.ఎవరైనా సైబర్ మోసానికి గురి అయితే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ కు కాల్ చేయాలి లేదా www.cybercr ime.go v.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలి. జరిగిన సైబర్ నేరం గురించి వెంటనే లేదా ఒక గం టలోపు ఫిర్యాదు చేస్తే మోసపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుందని కర్నూలు ఎ స్పీ తెలిపారు. విద్యార్థులు,తల్లిదండ్రులు అప్ర మత్తంగా ఉండి,కేవలం అధికారిక విధానాల ద్వా రానే అడ్మిషన్లు పొందాలని కర్నూలు ఎస్పీ వి క్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment