రహదారులపై జంతువులు వదిలేసే యజమానులకు నోటీసులు... పి.విశ్వనాధ్,కమిషనర్...
రహదారులపై జంతువులు వదిలేసే యజమా నులకు నోటీసులు
కర్నూలు నగరం నందలి వీధి జంతువులను పెంచు కుంటున్న యజమానులు తమ పందులు,ఆవులు, గాడిదలు,గేదెలు ప్రతి రోజు నగరంలోని ప్రధాన రహ దారులు,రోడ్డుకు మధ్యలో ఉంటూ ప్రజలు,వాహన దారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం జరుగు తుంది.ఈ నేపథ్యంలో వీధి జంతువుల యజమాను లకు శనివారం నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వ నాద్ నోటీసులు జారీ చేశారు.ఈ విషయంలో పెం చుకున్న వీధి జంతువులను తమ తమ నివాస స్థలా ల యందు తరలించకుండా ఇష్టానుసారంగా రోడ్లపై వదిలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.దీం తో ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తున్నా రని గమనించినట్లు పేర్కొన్నారు.కావున ప్రజల ఆరో గ్య భద్రతా దృష్ట్యా ప్రధాన రహదారులు రోడ్డుకు మ ధ్యలో మీరు పెంచుకున్న వీధి జంతువులు,పందులు, ఆవులు,గాడిదలు,గేదె లను వెంటనే వారి వారిని వాస స్థలాలకు తరలించి వాటి సంరక్షణ చూసుకోవా లని ఆదేశించా రు.లేని యెడల జి.ఓ.ఆర్.టి.నెం. 1109, తేది: 10-10-2025 మునిసిపల్ అడ్మిని స్ట్రేష న్,అర్బన్ డెవలప్ మెంట్ (A) డిపార్ట్ మెంట్.సూచిక మేరకు ప్రజలు,ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇ బ్బంది కలిగించి పూర్తీ నిర్లక్ష్యంగా వ్యవహారించిన నే పథ్యంలో యజమానులకు జరిమానా విధించబడు ను,చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.
Comments
Post a Comment