నూతన పల్లె అంగన్వాడీ టీచర్ పి.పద్మావతి మృతికి సిఐటియు సంతాపం...
నూతన పల్లె అంగన్వాడీ టీచర్ పి.పద్మావతి మృతికి సిఐటియు సంతాపం
అంగన్వాడి టీచర్ పి పద్మావతి గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులకు గురవుతూ బుధవారం కల్లూరు చెన్నమ్మ సర్కిల్,సుంకులమ్మ గుడి ఆమె స్వ గృహంలో మృతి చెందిన ఘటన జరిగింది.ఈ నేప థ్యంలో ఆమె పార్థివ దేహాన్ని సందర్శించన సిఐటి యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.డి.అంజి బా బు,పి.ఎస్.రాధాకృష్ణ, అంగన్వాడి యూనియన్ సిఐ టియు జిల్లా నాయకులు ఎం.గోపాల్,అంగన్వాడీ న గర నాయకులు మహమ్మద్ రఫీ,కే.సుధాకరప్ప, ఓల్డ్ సిటీ సిఐటియు నాయకులు ఆర్.కృష్ణలు సంతాపం తెలియచేశారు.పద్మావతి భర్త కూడా గత ఆరు నెలల క్రితం మరణించారు.పద్మావతికి ఒక కుమారుడు మా త్రమే ఉన్నారు.ప్రభుత్వం అంగన్వాడీలకు ఐసిడిఎస్ తరఫున రావలసిన ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని వెం టనే అందించాలని సిఐటియు,నాయకులు కోరారు. పద్మావతితో పాటు పనిచేస్తున్న సహచర గార్గేయపు రం సెక్టర్ అంగన్వాడీ టీచర్లు కూడా పద్మావతి మృత దేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు.
Comments
Post a Comment