ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో ఏడుగురు నింది తులు అరెస్ట్...11 లక్షల విలువ చేసే 17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం...టౌన్ ఏసిపి రమణమూర్తి...
ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో ఏడుగురు నింది తులు అరెస్టు
11 లక్షల విలువ చేసే 17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
టౌన్ ఏసిపి రమణమూర్తి
ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన నిందుతు ల ను ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు ఆ ధ్వర్యంలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి న ట్లు ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు.
ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం...ఖమ్మం మూ డవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన మోటార్ సైకిల్ దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సా రించిన పోలీసులకు శుక్రవారం వాహన తని ఖీ లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరు గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిం చిన్నట్లు పేర్కొన్నారు.ఖమ్మం,మహబూబాబాద్, సూర్యాపేట ప్రాంతాలలో గత కొన్ని నెలలుగా మోటార్ సైకిళ్ళ దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు.ఈ కేసులో మొత్తం 7 మంది నిందితులను అరెస్ట్ చేయగా,మరో ఇద్దరు పరా రీలో ఉన్నారని,నిందుతుల నుండి పలు మో టార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు తెలి పారు.నిందితులు దొంగతనం చేసిన మోటార్ సైకిళ్ళను తక్కువ ధరలకు మెకానిక్స్,ఇతర వ్యక్తులకు అమ్ముతూ వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైందని,పోలీసులు నిందితుల నుండి దొంగి లించిన (17) వాహనాలను స్వాధీనం చేసుకు న్నట్లు పేర్కొన్నారు.ఈ కేసులో మరికొందరు రిసీ వర్లను గుర్తించి వారిపై కూడా చట్టపరమైన చర్య లు తీసుకునే చర్యలు కొనసాగుతున్నాయని అ న్నారు.
అరెస్ట్ చేసిన నిందితులు :
1. కొండమీద యోగీశ్వర్ @ యోగీ 19 సం,స్టూ డెంట్ మామిళ్ళగూడెం,ఖమ్మం
2. మేడ సాయి కుమార్ 27 సంలు, కమాన్ బజార్,ఖమ్మం
3. మరో నలుగురు మైనర్లు.
రిసీవర్లు :
1. ముద్దంగుల నరేష్, 28yrs, తీగల బంజర, కొనిజెర్ల,ఖమ్మం. (అరెస్ట్)
2. షేక్ హరీఫ్,28yrs, తీగల బంజర, కొనిజెర్ల, ఖమ్మం. (పరారీ లో ఉన్నాడు)
3. నునావత్ వినోద్, 30yrs,తీగల బంజర, కొనిజెర్ల,ఖమ్మం.(పరారీలో ఉన్నాడు)
Comments
Post a Comment