మానవత్వానికి మారుపేరుగా నిలిచిన సీఐ విజయ లక్ష్మి...గర్భిణీ స్త్రీకి రూ.30వేలు ఆర్థిక సాయం...
మానవత్వానికి మారుపేరుగా నిలిచిన సీఐ విజయలక్ష్మి
గర్భిణీ స్త్రీకి రూ.30వేలు ఆర్థిక సాయం
ప్రస్తుతం యాంత్రిక జీవనంలో తోటి మనిషి కష్టా న్ని చూసి స్పందించే గుణం మృగ్యమైపోతున్న తరుణంలో, "నేనున్నానంటూ" ముందుకొచ్చి తన ఉదారతను చాటుకున్నారు సీఐ విజయల క్ష్మి.పోలీసు యూనిఫాంలో ఉన్నా,తన గుండె నిండా మానవత్వంతో విధులు నిర్వహించడమే కాకుండా...మానవ సేవయే...మాధవ సేవా అనే
నిండిన సూక్తి ప్రపంచంలో ఏది లేదని చాటి చెప్పి తన ఉదార స్వభావాన్ని సిఐ విజయలక్ష్మి మరో సారి నిరూపించుకున్నారు.వివరాలు ఇలా ఉ న్నాయి...బ్రహ్మంగారి మఠం మండలం,నరసన్న పల్లె గ్రామానికి చెందిన సోమిరెడ్డిపల్లె జగన్ ఎస్ కె 9టీవీ రిపోర్టర్ సతీమణి రేణుక ప్రస్తుతం తొ మ్మిది నెలల నిండు గర్భిణీ.ప్రసవ సమయం ఆస న్నమవుతున్న వేళ,ఆ కుటుంబం ఎదుర్కొంటు న్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులను సిఐ విజయలక్ష్మి తెలుసుకుని,తక్షణమే స్పందించారు.ఆమె డెలివరీ ఖర్చుల నిమిత్తం ఏకంగా రూ.30 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసి,ఆ కుటుంబానికి అం డగా నిలిచారు.ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. సమాజ సేవలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని, ఆపదలో ఉన్నవారిని ఆదుకో వడంలోనే అసలైన సంతృప్తి ఉందని పేర్కొన్నా రు.ఒక నిండు గర్భిణీ కన్నీరు తుడిచి, పుట్టబో యే బిడ్డకు భరోసానిచ్చిన విజయలక్ష్మి ఉదారత పై మండల వ్యాప్తంగా ప్రజలు ప్రశంసల జల్లు కు రిపిస్తున్నారు.ఖాకి దుస్తులు చూస్తేనే భయపడే రోజుల్లో... ఖాకి దుస్తులకు కూడా మానవత్వం ఉంటుంది అనే వాస్తవానికి ఇలాంటి అధికారులే ఆదర్శంగా నిలుస్తున్నారు.ఈ నేపథ్యంలో సిఐ విజయలక్ష్మి మాట్లాడుతూ ఖాకి దుస్తులు చూస్తే భయం కాదు భరోసా అనే భావనకు వద్దాం...వా రికి సహకరిద్దాం...సమాజాన్ని కాపాడుకుం దాం...అనే నినాదంతో ప్రజలు గుర్తించాలని కోరా రు.
Comments
Post a Comment