భార్య మృతిని తట్టుకోలేక ఎస్సై చంద్రశేఖర్ ఆ త్మహత్య....
భార్య మృతిని తట్టుకోలేక ఎస్సై చంద్రశేఖర్ ఆ త్మహత్య
కరీంనగర్ జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ బలవన్మరణానికి పాల్పడ్డారు.ఇటీవల ఆయన భార్య దివ్య ఆత్మహత్య చేసుకోవడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.భార్య మృతిని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రశేఖర్,ఇల్లందకుంట మండ లం,సీతంపేటలోని తన అత్తగారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.భార్య దివ్య అంత్యక్రియల సందర్భంగా ఎస్సై చంద్రశేఖర్పై గ్రామస్థులు దాడికి ప్రయత్నించినట్లు సమాచారం.అయితే ఆ సమయం లో దివ్య తండ్రి జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు లోకి తీసుకువచ్చినట్లు తెలిసింది.దివ్య మృతిపై అ నుమానాలు తలెత్తిన నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురైన చంద్రశేఖర్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.సంఘటన అనంతరం చం ద్రశేఖర్ మృతదేహాన్ని జమ్మికుంట ఆస్పత్రికి తరలిం చారు.ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం.నెల కొంది.తల్లి దండ్రుల మరణాలతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడం హృదయ విదారకంగా మారిం ది.
Comments
Post a Comment