ఎసిబి ట్రాప్ లో పట్టుబడిన ఎస్సై...టపాకాయలతో సంబరాలు చేసుకున్న ప్రజలు...
ఎసిబి ట్రాప్ లో పట్టుబడిన ఎస్సై
టపాకాయలతో సంబరాలు చేసుకున్న ప్రజలు
నాగర్ కర్నూల్ జిల్లా,తిమ్మాజీపేట ఎస్సై హరి ప్రసా ద్ రెడ్డి రూ.25వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధి కారులకు పట్టుబడ్డాడు.ఈ ఘటనతో ప్రజలు టపాకా యలతో సంబరాలు చేసుకున్నారు.ఇలాంటి ఎస్సైని ఇంతకాలం ప్రభుత్వం ఎలా కాపాడుకుంటుంది.అవి నీతికి పాల్పడే ఉద్యోగులు ఎక్కడ విధులు నిర్వహిం చిన ఇదే తంతు సాగిస్తారు.అవినీతికి పాల్పడి,ఎసిబి అధికారులకు పట్టుబడిన వారిపై సస్పెండ్,జైలు శిక్ష వంటివి సాధారణం...నేటి సమాజంలో వినూత్న ప్ర యోగాలు ప్రదర్శించాలి.ఎసిబికి పట్టుబడిన వారి జీ వన విశేషాలు,ఆస్తుల చిట్టా...ప్రజాక్షేత్రంలో ప్రదర్శిం చాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్న దుస్థితి ఏర్ప డింది.భవిష్యత్ లో ప్రభుత్వాలు ఈ దిశగా తమ ఆ దేశాలు జారీ చేయాలనీ కోరుతున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి...
నాగర్ కర్నూల్ జిల్లా,తిమ్మాజీపేట ఎస్సై హరిప్రసాద్ రెడ్డి,ఇసుక అక్రమ రవాణాలో పట్టుబడ్డ ట్రాక్టర్,జేసిబి వదిలి పెట్టేందుకు రూ.25 వేలు లంచం డిమాండ్ చే శారు.దీంతో కడుపు మండిన వాహనాల యజమాని ఏసీబీకి ఫిర్యాదు చేశారు.పకడ్బందీగా వల పన్ని,అవి నీతి ఎస్సైని పట్టేసింది.దీంతో ఇతర కేసుల్లో ఆయన బాధితుల దృష్టికి వెళ్ళింది.సమాచారం అందిన వెం టనే వారు పెద్దఎత్తున రోడ్లోనే టపాకాయలు పేల్చి, గెంతులేస్తూ సంబరాలు చేసుకున్నారు.అవినీతి ఎ స్సై డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.చాలామం దిని డబ్బులకు పీడించాడని,దారుణంగా కొట్టేవాడని బాధితుల ఆరోపణలు చేశారు.సీసీ కెమెరాల పేరుతో ప్రతి గ్రామంలో డబ్బులు వసూలు చేశాడని,భూ తగా దాలు,సివిల్ విషయాల్లో తలదూర్చి డబ్బులు దండు కున్నాడని నేడు దైర్యంగా ఆరోపిస్తున్నారు.
Comments
Post a Comment