ప్రియురాలిని ముక్కలు చేసి ఫ్రిజ్లో పెట్టిన కిరా తకుడు....విశాఖలో ఒళ్లు గగుర్పొడిచే ఘోరం...
ప్రియురాలిని ముక్కలు చేసి ఫ్రిజ్లో పెట్టిన కిరా తకుడు
విశాఖలో ఒళ్లు గగుర్పొడిచే ఘోరం
మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతోంది.నమ్మి న పాపానికి ఒక నిండు ప్రాణం బలైపోయింది.విశాఖ లోని ఎల్వీ నగర్ పరిధిలో జరిగిన ఒక దారుణ ఘట న ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టి స్తోంది.ప్రేమ పేరుతో దగ్గరై,అదే ప్రేమను ముక్కలు ముక్కలు చేసి ఫ్రిజ్లో దాచిన ఒక కిరాతకుడి ఉదం తం కన్నీళ్లు తెప్పిస్తోంది.వివరాలు ఇలా ఉన్నాయి... నేవీ టెక్నీషియన్గా పని చేస్తున్న రవీంద్ర (35) అనే వ్యక్తికి,మౌనిక (29) అనే యువతికి మధ్య పరిచ యం ఏర్పడింది.అయితే,రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకుని,మౌనికను తన ప్లాట్కు పిలిపించాడు.గత ఆదివారం రాత్రి ఇద్ద రి మధ్య ఏదో విషయంలో గొడవ జరగడంతో, ఆవే శం కట్టలు తెంచుకున్న రవీంద్ర...మౌనికపై అతి దారు ణ హత్యకు పాల్పడ్డాడు.
గుండె కరిగే విషాదం :
అక్కడితో ఆ రాక్షసుడి పైశాచికత్వం ఆగలేదు.మృత దేహం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి,ఫ్రిజ్లో దా చిపెట్టాడు.ఒకప్పుడు ప్రేమగా చూసుకున్న చేతులే, ఆ శరీరాన్ని ముక్కలు చేయడానికి ఎలా ఒడిగట్టా యో తలుచుకుంటేనే హృదయం ద్రవిస్తోంది.
పోలీసుల దర్యాప్తు :
నిందితుడు రవీంద్ర స్వయంగా పోలీసు స్టేషన్లో లొం గిపోయాడు.
మిస్సయిన ఆనవాళ్లు :
మౌనిక తల కనిపించకపోవడంతో పోలీసులు ము మ్మరంగా గాలిస్తున్నారు.అందమైన కలలతో బ్రతకా ల్సిన ఒక యువతి,ఇలా అమానుషంగా బలికావడం చూస్తుంటే సమాజం ఎటువైపు వెళ్తోందో అర్థం కావ డం లేదు.ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమ వుతున్నాయి.
Comments
Post a Comment