గ్యాస్ ఏజెన్సీల బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలి... సిపిఎం నిరసన...

గ్యాస్ ఏజెన్సీల బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలి
సిపిఎం నిరసన
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు నగరంలో గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ బుక్ చే సుకున్న కస్టమర్లకు సరైన సమయానికి గ్యాస్ సిలిం డర్ ఇవ్వకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని పూల బజార్ సెంటర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అబ్దుల్ దేశాయి అధ్యక్షతన మంగళవా రం నిరసన కార్యక్రమం చేపట్టారు.కార్యక్రమాన్ని ఉద్దే శించి సిపిఎం నగర ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.విజయ్, కే.రామకృష్ణ మాట్లాడుతూ అమెరికా,ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడిందని,ఈ మధ్యకాలం లో ఇంటికి వాడుకునే గ్యాస్ సిలిండర్ పై రూ.66 కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.105 పెంచడం జరిగిందని అన్నారు.అయినా ప్రజలు భరిస్తున్నారని, గ్యాస్ బుక్ చేసుకున్న కష్టమర్లకు ఫోన్ చేసి మీకు ఓటిపి నంబర్ వస్తుంది చెప్పండి అని ఓటిపి నెంబర్ చెప్పించుకున్న తర్వాత ఆ సిలిండర్ ను కస్టమర్ కు ఇవ్వకుండా హోటళ్లకు,చిరు వ్యాపారులకు బ్లాక్ లో రూ.2000 నుండి రూ.2,500 వరకు అమ్ముకోవడం జరుగుతుందని చెప్పారు.గ్యాస్ డెలివరీ బాయిస్, గ్యాస్ ఏజెన్సీల లీలలు అంతా ఇంతా కాదని తెలియ జేశారు.ఒకవైపు నిత్యవసర వస్తువులు పెరగడం,మ రోవైపు గ్యాస్ బుక్ చేసు కున్నప్పటికీ సరైన సమ యానికి అందకపోవడం కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ల క్ష్యమేనని విమర్శించారు.మన ప్రధాని నరేంద్ర మోడీ రష్యా నుండి ముడి చమురు రూపాయలలో కొని రిలయన్స్ కు కట్టబెడుతున్నాడని,ఈ దేశ ప్రజల క న్నా కార్పొరేట్ శక్తులైన ఆదానీ,అంబానీలే ఎక్కువ య్యారని ప్రజలకేమో కష్టాలు ఆధాని,అంబానీలకు సబ్సిడీలు ఇవ్వడం ఇది చాలా దుర్మార్గమని విమ ర్శించారు.అమెరికా,ఇరాన్ యుద్ధం వల్ల గ్యాస్ సర ఫరాలో మనకు ఎలాంటి ఇబ్బందులు లేవని,ఇరాన్ నుండి వచ్చే గ్యాస్ కార్గో షిప్పులకు మన జెండా ఉంటే ఫ్రీగా వదిలే పరిస్థితి ఉందని అన్ని పత్రికలలో ప్రముఖంగా వస్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టించి గ్యాస్ వాడే కస్టమర్లను ఇబ్బందికి గురి చేయడం సరైన పద్ధతి కాదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు చాంద్,ఇస్మాయిల్,గిడ్డయ్య,ప్రకాష్,వెంకటేశ్వర్లు,రా మాంజనేయులు,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....