కోడిపందాలపై దాడి...నిర్వాహకుడు సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...
కోడిపందాలపై దాడి...నిర్వాహకుడు సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
గుంటూరు జిల్లా,తాడేపల్లి,పోలీస్ స్టేషన్ పరి ధిలోని ఇప్పటం గ్రామ శివారులో అక్రమంగా నిర్వహిస్తున్న కోడిపందాలపై టాస్క్ ఫోర్స్,స్థానిక పోలీసులు సం యుక్తంగా దాడి చేసి నిర్వాహకుడు సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల సమాచారం మేరకు...రైల్వే ట్రాక్ పక్కన ఉన్న మర్రిచెట్టు క్రింద కో డిపందాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచా రం రావడంతో ఎస్బీ సీఐ–1కు తెలియజేయగా టా స్క్ ఫోర్స్ సీఐ ఆదేశాల మేరకు తాడేపల్లి పోలీస్ సి బ్బందితో కలిసి సంఘటన స్థలంపై ఆకస్మికంగా దాడి చేశారు.దాడి సందర్భంగా నులకపేటకు సంబంధిం చిన వ్యక్తి,ఆత్మకూరు సంబంధించిన వ్యక్తి వాళ్ల ఆధ్వ ర్యంలో కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఘటనాస్థలంలో రెండు పందెం కోళ్లు,ఆరుగురు వ్య క్తులు,ఆరుసెల్ ఫోన్లు,తొమ్మిది టూ వీలర్లు,రూ.9,4 50 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వా రిని స్వాధీ నం చేసిన వస్తువులను తదుపరి విచా రణ నిమిత్తం తాడేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించిన ట్లు పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసి దర్యా ప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Post a Comment