ఫేక్ కోర్టు,ఫేక్ పోలీసులు...డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ అధికారికి 1.57 కోట్ల టోకరా...

ఫేక్ కోర్టు,ఫేక్ పోలీసులు...డిజిటల్ అరెస్ట్
పేరుతో రిటైర్డ్ అధికారికి 1.57 కోట్ల టోకరా
VS9TV న్యూస్,హైదరాబాద్ :
ముంబై పోలీసుల కథనం ప్రకారం...అంధేరిలోని డీఎన్ నగర్ ప్రాంతానికి చెందిన బాధితుడికి 2025, డిసెంబర్,6న సంజయ్ కుమార్ గుప్తా అనే వ్యక్తి ఫోన్ చేశాడు.తాను టెలికమ్యూనికేషన్స్ విభాగం అధికా రినని,బాధితుడి మొబైల్ నంబర్ నుంచి అభ్యంతర కరమైన ఎంఎంఎస్‌లు వెళ్తున్నాయని,దీనిపై బాంద్రా క్రైమ్ బ్రాంచ్‌లో కేసు నమోదైందని నమ్మించాడు.ఆ తర్వాత కాల్‌ను ప్రదీప్ సావంత్ అనే మరో నకిలీ పోలీస్ అధికారికి బదిలీ చేశారు.బాధితుడిపై మనీ లాండరింగ్ కేసు కూడా ఉందని,వ్యాపారవేత్త నరేష్ గోయల్‌ తో సంబంధాలున్నాయని బెదిరించారు.తమ మోసాన్ని నిజమని నమ్మించేందుకు,వీడియో కాల్‌లో ఏకంగా నకిలీ కోర్టు విచారణను సృష్టించారు.సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఎస్.గ వాయ్ పర్యవేక్షణలో విచారణ జరుగుతున్నట్లు న మ్మించి,సహకరించకపోతే తక్షణమే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.ఈ మానసిక ఒత్తిడితో భయపడిపో యిన బాధితుడు,దర్యాప్తులో భాగంగా "వెరిఫికేషన్" కోసం తన వద్ద ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు,మ్యూ చువల్ ఫండ్స్,సేవింగ్స్ సహా మొత్తం సొమ్మును వారు చెప్పి న బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయాలని సూచించా రు.అరెస్ట్ భయంతో,2025,డిసెంబర్,8నుంచి 2026, జనవరి,3మధ్య విడతల వారీగా రూ.1.57 కోట్లు బ దిలీ చేశాడు.డబ్బు బదిలీలు పూర్తయ్యాక నేరగాళ్ల నుంచి కాల్స్ రావడం ఆగిపోవడంతో బాధి తుడికి అనుమానం వచ్చింది.కుటుంబ సభ్యులతో చర్చించి, సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు మనీ ట్ర యల్‌ను ట్రేస్ చేయగా,ఆటో-రిక్షా డ్రైవర్ అయిన అశోక్ పాల్ ఖాతాలోకి నిధులు వెళ్లినట్లు గు ర్తించారు.కమీషన్ తీసుకుని తన ఖాతాను సైబర్ నేర గాళ్లకు వాడుకోవడానికి అనుమతించినట్లు విచార ణలో పాల్ అంగీకరించాడు.పోలీసులు అతడిని అరె స్ట్ చేసి,మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.ఈ నేపథ్యంలో,ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమ త్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు."డిజి టల్ అరెస్ట్" లేదా "ఆన్‌లైన్ కోర్టు విచారణ" వంటి ప దాలు పూర్తిగా మోసపూరితమైనవని స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా డబ్బు బదిలీ చేయమని అడగదని గుర్తు చేశా రు.అనుమానాస్పద కాల్స్ వస్తే భయపడకుండా,సైబ ర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....