బంజారాహిల్స్ నాగార్జున ఎక్స్ రోడ్ సమీపం,స్మశాన వాటికలో గ్యాస్ సిలిండర్ లు అక్రమనిలువ... 10మంది గ్యాస్ సిలిండర్ల ముఠా అరెస్ట్...
బంజారాహిల్స్ నాగార్జున ఎక్స్ రోడ్ సమీపం,స్మశాన వాటికలో గ్యాస్ సిలిండర్ లు అక్రమ నిలువ
10మంది గ్యాస్ సిలిండర్ల ముఠా అరెస్ట్
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఘటనలో టాస్క్ఫోర్స్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. బంజారాహిల్స్లో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసి,అధిక ధరలకు విక్రయిస్తున్న10మంది నిందితులను అరెస్ట్ చేశారు.జూబ్లీహిల్స్ జోన్ టా స్క్ఫోర్స్,బంజారాహిల్స్ పోలీసుల సంయుక్త దాడి లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.వివరాలు ఇ లా ఉన్నాయి...మెట్రో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు మొహమ్మద్ అమీర్ శంషాబాద్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్నారు.బంజారాహిల్స్ నాగార్జున ఎక్స్ రోడ్.స మీపంలోని స్మ శాన వాటికలో గ్యాస్ సిలిండర్లను అక్ర మంగా నిల్వ ఉంచి,అక్కడి నుండి వినియోగదారు లకు ప్రభుత్వ ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.అందిన సమాచారం మేర కు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ యదేందర్ బృందం దాడి చేసి 10మంది ముఠాను అరెస్ట్ చేశారు.అదేవిదంగా 414 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసి (డీసీఎంలు,బొలెరో, టాటా ఏస్,ఆటోలు) 10వాహనాలను సీజ్ చేశారు. వాటిని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.ప్ర జల భద్రతకు ముప్పు కలిగించే అక్రమ గ్యాస్ వ్యాపా రంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని పెద్ద నెట్ వ ర్క్ ను ఛేదించారు.
Comments
Post a Comment