యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలి...ఈ గల్ టీం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ...
యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలి
ఈగల్ టీం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ
కర్నూలు కలెక్టరేట్ దగ్గర ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్నూలు బ్లడ్ బ్యాంక్ లో శనివారం ఈగల్ టీం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.కా ర్యక్రమానికి ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ ప్రారం భించారు.ఈ సందర్భంగా కె.వి.సుబ్బారెడ్డి కళాశాల కు చెందిన 28మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్త దానం చేశారు.అలాగే తలసేమియా రక్త మార్పిడి కేంద్రాన్ని ఐజీ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆరు మంది తల సేమియా బాధితులైన పిల్లలకు రక్త మా ర్పిడి నిర్వహించారు.వేసవికాలంలో రక్తం కొరత ఉం టుందని,యువత ముందుకు వచ్చి రక్తదానం చేయా లని ఈ సందర్బంగా ఈగల్ ఐజి పిలుపు నిచ్చారు. సమాజ సేవలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా,ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ కర్నూలు డిస్టిక్ బ్రాంచ్ చైర్మన్ డాక్టర్ కేజీ.గోవింద రెడ్డి,వైస్ చైర్మన్ కె.అరుణ,ట్రెజరర్ ఐ.న రసింహ,కర్నూలు టు టౌన్ సిఐ నాగరాజా రావు, కమిటీ మెంబర్లు జి.శ్రీనివాస్ యాదవ్,ఎం.జె.బాబు రాజు,కెవి.సుబ్బారెడ్డి,మెడికల్ ఆఫీసర్లు బి.కుమార స్వామి రెడ్డి,జి.రామచంద్ర రావు,కె.వి.సుబ్బారెడ్డి ఇం జనీరింగ్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Post a Comment