కట్టుకున్న భార్యను హత్య చేసి,మృతదేహాన్ని బైక్పై తీసుకొచ్చి చెట్ల పొదల్లో పడేసిన భర్త...
కట్టుకున్న భార్యను హత్య చేసి,మృతదేహాన్ని బైక్పై తీసుకొచ్చి చెట్ల పొదల్లో పడేసిన భర్త
రంగారెడ్డి జిల్లా,దేవునిపల్లి పంచాయతీ పరిధిలోని రంగారెడ్డిగూడ శివారులో దారుణ ఘటన చోటుచే సుకుంది.పోలీసుల వివరాల ప్రకారం..రంగారెడ్డి గూ డ గ్రామానికి చెందిన శోభారాణి (31)కి పదేళ్ల క్రితం మహబూబ్నగర్ జిల్లా,కోయి లకొండకు చెందిన రా జుతో వివాహం జరిగింది.వీరికి మహేందర్ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు.భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో శోభారాణి కోయిలకొండకే చెందిన నర్సిం హులును రెండో వివాహం చేసుకుంది.వీరికి రెండేళ్ల కూతురు మమత ఉంది.మహేందర్ కూడా తల్లితో పాటే ఉంటున్నాడు.నర్సింహులు తాగుడుకు బానిస కావడంతో కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జ రుగుతున్నాయి.దీంతో శోభారాణి ఆరునెలల క్రితం కూతురును తీసుకొని పుట్టింటికి వచ్చేసింది.భార్య తో మాట్లాడేందుకు నర్సింహులు రెండు రోజుల క్రితం రంగారెడ్డిగూడకు వచ్చాడు.నిన్న కుమారుడు మహేం దర్కు సైకిల్ కొనిద్దామని చె ప్పి శోభారాణిని మహ బూబ్ నగర్కు తీసుకెళ్లాడు.అక్కడ మరోసారి ఇద్ద రూ గొడవపడ్డారు.నర్సింహులు భార్యను దారుణంగా హత్య చేశాడు.తర్వాత కూతురు మమతను బైక్పై ముందు కూర్చోబెట్టుకొని,భార్య మృతదేహాన్ని వెన కాల కట్టేసి,రంగారెడ్డిగూడ శివారులోకి తీసుకొచ్చి చె ట్ల పొదల్లో పడేశాడు.కూతురును అక్కడే వది లేసి పరారయ్యాడు.తల్లి హత్యకు గురైందని తెలియని ఆ చిన్నారి ఆకలితో అలమటిస్తూ ఏడుస్తుండగా,గత ఆదివారం తెల్లవారు జామున అటుగా వెళ్లిన గ్రామ స్తులు ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలాన్ని డీసీపీ శిరీష,ఏసీపీ ల క్ష్మీనారాయణ,పట్టణ సీఐ సీతారాం పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Comments
Post a Comment