గ్యాస్ సిలిండర్ ల కొరత...డీజిల్ స్టవ్ తయారీ...

గ్యాస్ సిలిండర్ ల కొరత...డీజిల్ స్టవ్ తయారీ
VS9TV న్యూస్, హైదరాబాద్ :
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో హోటళ్ల నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అల్పాహార కేం ద్రం నడుపుతున్న మహేశ్ వినూత్న ఆలోచనతో డీజి ల్ తో పనిచేసే స్టవ్ తయారు చేశారు.చిన్నపాటి వి ద్యుత్తు మోటారును నడపడంతో వచ్చే గాలిని ఓ పై పు ద్వారా...డీజిల్ మ రో పైపు ద్వారా పొయ్యి దగ్గ రకు పంపి...అక్కడ వెలిగించడం ద్వారా మంట వచ్చే లా దీనిని రూ పొందించారు.అవసరాన్ని బట్టి మం టను హెచ్చు తగ్గులు చేసుకునే వీలుంది.ఒక లీటరు డీజిల్ గంట నుంచి రెండు గంటలు పొయ్యి మండు తుందని మహేశ్ తెలిపారు.వాణిజ్య సిలిండర్ ధరతో పోల్చితే దీంతో ఖర్చు సగానికి తగ్గిందన్నారు.దీని త యారీకి సుమారు రూ.10 వేల ఖర్చుతో పాటు నాలు గు రోజుల పాటు శ్రమించినట్లు వెల్లడించారు.ఇది చూసిన మరో రెండు హోటళ్ల నిర్వాహకులు సైతం ఇ లానే పొయ్యిలు తయారు చేయించుకోవడం విశేషం.

Comments